News April 24, 2025
అండమాన్లో మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం

అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. బీజేపీ మద్దతుతో సౌత్ అండమాన్లోని శ్రీవిజయపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. 24 మంది సభ్యులున్న కౌన్సిల్లో టీడీపీ 15 ఓట్లు రాబట్టి ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి సాహుల్ హమీద్ గెలుపొందారు.
Similar News
News April 25, 2025
TODAY HEADLINES

* డబ్బులు లేకున్నా హైటెక్ సిటీ నిర్మించా: చంద్రబాబు
* రూపాయికి ఇడ్లీ అయినా వస్తుందా?: జగన్
* ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
* ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తాం: మోదీ
* ఉగ్రదాడి ఘటనపై ముగిసిన అఖిలపక్ష భేటీ
* కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తాం: రాహుల్
* పహల్గామ్ ఘటనను దేశం ఎప్పటికీ మరిచిపోదు: పవన్
* IPLలో RRపై RCB థ్రిల్లింగ్ విక్టరీ
News April 25, 2025
BREAKING: RCB సూపర్ విక్టరీ

ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ ఎట్టకేలకు హోంగ్రౌండు(చిన్నస్వామి)లో గెలుపు బోణీ కొట్టింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ను 194/9 స్కోరుకు కట్టడి చేసి 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. జైస్వాల్ 49, సూర్యవంశీ 16, నితీశ్ 28, పరాగ్ 22, జురెల్ 47, హెట్మైర్ 11, శుభమ్ 12 పరుగులు చేశారు. RCB బౌలర్లలో హాజిల్వుడ్ 4, కృనాల్ 2, భువనేశ్వర్, యశ్ దయాల్ చెరో వికెట్ తీశారు.
News April 25, 2025
సింధు జలాల ఒప్పందం రద్దు.. పాక్కు తేల్చిచెప్పిన భారత్

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. తక్షణమే జల ఒప్పందం రద్దు అమల్లోకి వస్తుందని తెలియజేస్తూ జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాక్కు లేఖ రాశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహించడమే కారణమని పేర్కొన్నారు. అగ్రిమెంట్లో భాగంగా సంప్రదింపులకు విజ్ఞప్తిని పలుమార్లు పాక్ తిరస్కరించిందని గుర్తు చేశారు.