News October 22, 2024
గ్యాంగ్ రేప్ నిందితులతో టీడీపీకి సంబంధాలు: వైసీపీ
AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విద్యార్థినులపై అత్యాచారం చేసిన నిందితులకు TDPతో సంబంధాలు ఉన్నాయని YCP ఆరోపించింది. నిందితుడు శివ బంధువు జానకీరావు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, మరో నిందితుడు మోహన్ వాళ్ల మామ ఎమ్మెల్యే గౌతు శిరీషకు అనుచరుడని తెలిపింది. దీంతో బాధితులకు నిందితులకు మధ్య రాజీకి ప్రయత్నాలు చేశారని పేర్కొంది. కూటమి నేతలు శాడిస్ట్లను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టింది.
Similar News
News October 22, 2024
బాబు బొడ్డుతాడు కట్ చేసిన యూట్యూబర్.. కేసు నమోదు
వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు చట్టవ్యతిరేక పనులు చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఇర్ఫాన్ అనే వ్యక్తి తన భార్య డెలివరీ జరుగుతుండగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లి బాబు బొడ్డుతాడును కట్ చేశాడు. దీన్ని వీడియో తీసి యూట్యూబ్లో పోస్టు చేయగా వైరలైంది. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ సీరియస్ అయ్యింది. సదరు వ్యక్తి, డాక్టర్, ప్రైవేట్ ఆస్పత్రిపై కేసు పెట్టింది.
News October 22, 2024
కామన్వెల్త్ గేమ్స్-2026 నుంచి ఆ క్రీడలు తొలగింపు
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్-2026 నుంచి క్రికెట్, హాకీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలను నిర్వాహకులు తొలగించారు. ఖర్చును తగ్గించుకునేందుకు కేవలం 10 క్రీడలతో నిర్వహిస్తామని ప్రకటించారు. గతంలో ఈ స్పోర్ట్స్లోనే భారత్ ఎక్కువ మెడల్స్ సాధించింది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం భారత్కు ప్రతికూలంగా మారింది. 2022లో 19 క్రీడల్లో ఈ పోటీలు జరిగాయి.
News October 22, 2024
Stock Market: భారీ నష్టాలు
త్రైమాసిక ఫలితాల్లో కీలక సంస్థల వీక్ ఎర్నింగ్స్, FIIల అమ్మకాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 80,220 వద్ద, నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 24,472 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీలో 47 స్టాక్స్ నష్టపోయాయి. BSEలో ICICI, Infy మినహా మిగిలిన 28 స్టాక్స్ రెడ్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.