News June 4, 2024
కడపలో 25 ఏళ్ల తర్వాత టీడీపీ విజయం

AP: కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ దాదాపు 25 ఏళ్ల తర్వాత గెలిచింది. చివరిసారిగా 1999లో ఖలీల్ బాషా విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 09లో అహ్మదుల్లా(కాంగ్రెస్), 2014, 2019లో అంజాద్ బాషా(వైసీపీ) గెలిచారు. అలాగే ఒక ముస్లిమేతర వ్యక్తి అక్కడ గెలవడం 35 ఏళ్లలో ఇదే తొలిసారి. 1989లో శివానందరెడ్డి(INC) గెలవగా, ఇప్పుడు మాధవీరెడ్డి(టీడీపీ) సంచలన విజయం సాధించారు.
Similar News
News January 25, 2026
ఏ తిథి రోజున ఎవరిని ఆరాధించాలంటే..? (2/2)

నవమి: కష్టాల తొలగింపు, మేధస్సు కోసం రాముడు.
దశమి: ఆయుష్షు, అపమృత్యు దోష నివారణకై యముడు.
ఏకాదశి: పాప పరిహారం, మోక్షం కోసం విష్ణుమూర్తి.
ద్వాదశి: పుణ్య ఫలం, స్థిరత్వం కోసం వరాహస్వామి.
త్రయోదశి: కోరికలు నెరవేరడం, ఆనందంకై శివుడు.
చతుర్దశి: గ్రహ దోష నివారణ కోసం శివుడు, రుద్రుడు.
పూర్ణిమ: మనశ్శాంతి, ఐశ్వర్యం కోసం చంద్రుడు/లలితా దేవి.
అమావాస్య: పితృ రుణ విముక్తి, వంశాభివృద్ధికై పితృదేవతలు.
News January 25, 2026
రైతులకు శుభవార్త.. భారీగా పెరిగిన వేరుశనగ ధర

గతేడాది ధరలు లేక ఇబ్బందిపడిన వేరుశనగ రైతులకు ఈ ఏడాది ఊరట కలుగుతోంది. ఇటీవల TGలోని కల్వకుర్తి మార్కెట్లో క్వింటా ధర గరిష్ఠంగా ₹9,865, వనపర్తిలో ₹9,784, నారాయణపేటలో ₹9,500, APలోని ఆదోని మార్కెట్లో నిన్న ₹9,652 పలికింది. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా నూనె గింజలకు నెలకొన్న డిమాండే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కాగా గత ఏడాది క్వింటా ధర రూ.7వేల లోపే పలికింది.
News January 25, 2026
పద్మ భూషణ్ అవార్డులు వీరికే

ఈ ఏడాది కేంద్రం 13 మందికి పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. జాబితాలో అల్క యాగ్నిక్(ఆర్ట్), భగత్ సింగ్ కోశ్యారి(పబ్లిక్ అఫైర్స్), కల్లిపట్టి రామస్వామి(మెడిసిన్), మమ్ముట్టి(ఆర్ట్), దత్తాత్రేయుడు(మెడిసిన్), పీయూష్ పాండే(ఆర్ట్), మైలానందన్(సోషల్ వర్క్), సత్యవర్ధని(ఆర్ట్), శిబూ సోరెన్, ఉదయ్ కోటక్(ఇండస్ట్రీ), VK మల్హోత్రా(పబ్లిక్ అఫైర్స్), వెల్లపల్లి నటేశన్(పబ్లిక్ అఫైర్స్), అమృత్ రాజ్(స్పోర్ట్స్).


