News December 25, 2024

₹10కే టీ, ₹20కి సమోసా.. అది కూడా విమానాశ్రయంలో

image

అధిక ధరల కారణంగా విమానాశ్రయంలో ఏం తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటిది ₹10కే టీ, వాట‌ర్ బాటిల్‌, ₹20కే కాఫీ, సమోసా లభించనున్నాయి. తక్కువ ధరలకే రీఫ్రెష్‌మెంట్స్ అందించే ‘ఉడాన్ యాత్రి కేఫే’ పైల‌ట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు మంగ‌ళ‌వారం కోల్‌క‌తా విమానాశ్ర‌యంలో ప్రారంభించారు. ఆప్ ఎంపీ రాఘవ్ చ‌ద్దా ఈ అంశాన్ని పార్ల‌మెంటులో లేవ‌నెత్తగా, ప్ర‌భుత్వం కేఫే ఏర్పాటుకు ముందుకొచ్చింది.

Similar News

News December 13, 2025

మంత్రి సంధ్యారాణిని కలిసిన మన్యం డీఈవో

image

పార్వతీపురం మన్యం జిల్లా డీఈవో‌గా బాధ్యతలు స్వీకరించిన పి.బ్రహ్మాజీరావు శనివారం మంత్రి సంధ్యారాణిని సాలూరు క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవంతో జిల్లాను విద్యారంగంలో మరింత ప్రగతి సాధించేలా కృషి చేయాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. వీరితో పాటు డిప్యూటీ డీఈవో రాజ్ కుమార్ మంత్రిని కలిశారు.

News December 13, 2025

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీ 2 ల్యాబ్ ట్రైనీ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది. డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్), బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 18న ఉదయం 9.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎంపికైనవారికి నెలకు జీతం రూ.18,000-రూ.22,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nitandhra.ac.in/

News December 13, 2025

ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

image

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.