News July 26, 2024
మహిళలు మంగళసూత్రం ధరించొద్దన్న టీచర్.. సస్పెండ్

గిరిజన మహిళలు నుదుటిన తిలకం పెట్టుకోవద్దని, మెడలో మంగళసూత్రం ధరించవద్దని చెప్పిన టీచర్ మేనకా దామోర్ను రాజస్థాన్ విద్యాశాఖ సస్పెండ్ చేసింది. బాన్స్వారాలో ఈ నెల 19న ఓ కార్యక్రమంలో ఆ టీచర్ పాల్గొని గిరిజన మహిళలను ఉద్దేశిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పండితులు చెప్పిన మాటలు నమ్మవద్దని వారికి సూచించారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వేటు వేసింది.
Similar News
News October 22, 2025
ఇంటర్ పరీక్షల్లో మార్పులు!

AP: ఇంటర్ పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకపై గణితం ఒకే పేపర్ 100 మార్కులకు ఉంటుంది. 35 మార్కులొస్తే పాస్ అవుతారు. బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీలో 85 మార్కులకు పరీక్షలుంటాయి. ఫస్టియర్లో 29, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాసవుతారు. ప్రస్తుతం సెకండియర్ చదివేవారికి ఇవి వర్తించవు. కాగా 1st అటెంప్ట్లో 4 పేపర్లలో 35% మార్కులొచ్చి, ఓ పేపర్లో 30% వచ్చినా పాసేనని అధికారులు చెప్తున్నారు.
News October 22, 2025
పోషకాల నిలయం.. BPT-2858 ఎర్ర వరి రకం

అత్యంత పోషక విలువలు గల BPT-2858 ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. ఇది త్వరలో మార్కెట్లోకి రానుంది. దీని పంట కాలం 135 రోజులు. దిగుబడి హెక్టారుకు ఆరు టన్నులు. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ రాకుండా రోగ నిరోధక శక్తి వృద్ధి చేయడంలో ఈ రకం కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 22, 2025
స్మృతి ఇరానీ సీరియల్లో బిల్గేట్స్

హిందీ టీవీ సీరియల్ ‘క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ’లో లీడ్ రోల్లో బీజేపీ మాజీ ఎంపీ స్మృతి ఇరానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్, నవజాత శిశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా స్మృతి, గేట్స్ మధ్య వీడియో కాల్ కాన్వర్జేషన్ ఉంటుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తైందని, 3 ఎపిసోడ్స్లో ఆయన కనిపిస్తారని తెలిసింది.