News July 26, 2024
మహిళలు మంగళసూత్రం ధరించొద్దన్న టీచర్.. సస్పెండ్

గిరిజన మహిళలు నుదుటిన తిలకం పెట్టుకోవద్దని, మెడలో మంగళసూత్రం ధరించవద్దని చెప్పిన టీచర్ మేనకా దామోర్ను రాజస్థాన్ విద్యాశాఖ సస్పెండ్ చేసింది. బాన్స్వారాలో ఈ నెల 19న ఓ కార్యక్రమంలో ఆ టీచర్ పాల్గొని గిరిజన మహిళలను ఉద్దేశిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పండితులు చెప్పిన మాటలు నమ్మవద్దని వారికి సూచించారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ ఆమె నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వేటు వేసింది.
Similar News
News December 7, 2025
రోహిత్, కోహ్లీలకు గంభీర్ షాక్!

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన సిరీసుల్లో రాణించినప్పటికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. విరాట్, రోహిత్ శర్మలు 2027 WC ఆడటంపై గ్యారంటీ ఇవ్వలేదు. వారిద్దరూ 2027 ప్రపంచకప్ ఆడతారా అని జర్నలిస్టులు అడగ్గా.. ‘వన్డే ప్రపంచకప్ మరో రెండేళ్లు ఉందని మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. యంగ్ ప్లేయర్లు చక్కగా ఆడుతూ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు.
News December 7, 2025
విత్తన మొలక శాతం.. పంట దిగుబడికి ముఖ్యం

పంట దిగుబడి బాగుండాలన్నా, వ్యవసాయం లాభసాటిగా సాగాలన్నా పంటకు ‘విత్తనం’ ప్రధానం. అందుకే మేలైన దిగుబడి కోసం మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించాలి. విత్తన కొనుగోలు తర్వాత దాని మొలక శాతాన్ని పరిశీలించాలి. అది నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. అసలు విత్తన మొలక శాతాన్ని ఎలా పరిశీలించాలి? దానికి అందుబాటులో ఉన్న పద్ధతులు ఏమిటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 7, 2025
ఒకరికి 38, మరొకరికి 37.. అయితేనేం అదరగొట్టారు

SAతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ కైవసం చేసుకోవడంలో ‘రో-కో’ కీలక పాత్ర పోషించారు. గత రెండు సిరీస్లను గమనిస్తే ఒక్కోసారి ఒక్కో స్టార్ అదరగొట్టారు. AUSతో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ(38y) అత్యధిక పరుగులు, సగటు, బౌండరీలు, P.O.Sగా నిలిస్తే, తాజాగా SAతో జరిగిన సిరీస్లో అవే రికార్డులు విరాట్ కోహ్లీ (37y) దక్కించుకున్నారు. 37+ ఏళ్ల వయసులోనూ ఈ ఇద్దరూ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ విజయాలను అందిస్తున్నారు.


