News July 5, 2024
టీచర్ ట్రాన్స్ఫర్.. స్కూల్ మారిన 133 మంది స్టూడెంట్స్!

TG: ఉపాధ్యాయుడిపై ప్రేమ, గౌరవంతో 133 మంది విద్యార్థులు స్కూల్ మారారు. మంచిర్యాల జిల్లా జన్నారం(M) పోనకల్ ప్రభుత్వ స్కూల్ టీచర్ జె.శ్రీనివాస్ ఇటీవల అదే మండలంలోని అక్కపెల్లిగూడలోని స్కూలుకు బదిలీ అయ్యారు. తాము అభిమానించే, తమకు స్పెషల్ క్లాసులు చెప్పే గురువు కోసం విద్యార్థులు 3 కి.మీ దూరంలో ఉన్న ఆ పాఠశాలకు మారారు. దీనికి తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారు.
Similar News
News April 3, 2026
సంజీవ్ గోయెంకా జోకర్: లలిత్ మోదీ

LSG ఓనర్ <<19547295>>సంజీవ్ గోయెంకా<<>>పై IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మ్యాచ్ ఓడిపోతే అతను తన టీమ్ కెప్టెన్, కోచింగ్ స్టాఫ్తో వ్యవహరించే తీరును ఎండగట్టారు. ఆయన ఓ లూజర్, జోకర్ అంటూ మండిపడ్డారు. ప్లేయర్లు, అభిమానుల కోసం లీగ్ను సృష్టించానన్నారు. తానింకా IPL ఛైర్మన్గా ఉంటే ఆయన్ను బ్యాన్ చేయడంతో పాటు జట్టుపై అతని యాజమాన్యాన్ని శాశ్వతంగా రద్దు చేసేవాడిని అని ట్వీట్ చేశారు.
News April 3, 2026
సేతుపతి-సాయిపల్లవి మూవీ.. జూన్లో సెట్స్పైకి!

విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా మణిరత్నం తెరకెక్కించనున్న కొత్త మూవీ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే దీనిపై అప్డేట్ రానున్నట్లు సమాచారం. మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్తో సాయిపల్లవి నటించిన ‘ఏక్ దిన్’ మే 1న రిలీజ్ కానుంది.
News April 3, 2026
మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది గుర్తింపు: రేవంత్

TG గ్రూప్-1 ఉద్యోగ నియామకాల విషయంలో <<19551715>>సుప్రీంకోర్టు<<>> ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు. రాష్ట్ర పునర్నిర్మాణంలో గ్రూప్-1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశాం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వ్యవస్థను ప్రక్షాళన చేసి నియామకాలను పూర్తి చేసిన TGPSC ఛైర్మన్, సిబ్బందికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు.


