News August 5, 2024
టీచర్లూ.. పుస్తకాల్లో తప్పులుంటే చెప్పండి: SCERT కొత్త ప్రయోగం

TG: 1-10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తప్పులు దొర్లకుండా రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల సేవల్ని వినియోగించుకునే సరికొత్త ప్రయోగానికి విద్యా పరిశోధన, శిక్షణ మండలి శ్రీకారం చుట్టింది. సబ్జెక్ట్ నిపుణులు, డైట్, ప్రభుత్వ బీఈడీ కళాశాలల అధ్యాపకులు తప్పులుంటే గుర్తించి పంపేలా చర్యలు తీసుకోవాలని DEOలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఇటీవల పాఠ్యపుస్తకాల్లో పాత మంత్రుల పేర్లు ముద్రించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
Similar News
News December 12, 2025
టాటూలతో స్కిన్ క్యాన్సర్ ముప్పు

ఫ్యాషన్ కోసం చాలామంది టాటూస్ వేయించుకుంటుంటారు. అయితే దీనివల్ల స్కిన్ క్యాన్సర్ ముప్పు 29 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. లండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో టాటూ వేయించుకున్నవారికి తీవ్రమైన మెలనోమా క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. కాబట్టి టాటూ వేయించుకున్న ప్రాంతంలో ఏవైనా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News December 12, 2025
అనఘాష్టమి వ్రత విధానం

పూజా మందిరంలో పీఠంపై దత్తాత్రేయుడు చిత్రపటాన్ని పూలతో అలంకరించాలి. అష్టదళ పద్మం వేసి, దానిపై కలశం ఉంచి, ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. మొదట గణపతి పూజ చేయాలి. అనంతరం అనఘస్వామిని ఆరాధించాలి. పగటిపూట నిద్రించకూడదు. ఉపవాసం ఉండాలి. ‘ఓం దత్తాత్రేయాయ నమః’ అని స్మరించాలి. రాత్రిపూట సాత్వికాహారం తీసుకోవాలి. వ్రతం పూర్తయ్యాక దక్షిణ, తాంబూలం, వ్రత పుస్తకాలు ఇవ్వాలి. ఈ వ్రతం మహిళలు ఎవరైనా చేయవచ్చు.
News December 12, 2025
బొగ్గు పొయ్యిలపై తందూరీ వద్దు!

ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు బొగ్గు పొయ్యిలపై తందూరీ తయారీని నిషేధించారు. హోటల్స్, దాబాలు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో కట్టెల పొయ్యిలనూ వాడొద్దని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ఆదేశించింది. రూల్స్ అతిక్రమిస్తే భారీగా ఫైన్ వేస్తామని హెచ్చరించింది. ఢిల్లీలోని లజపత్నగర్, కరోల్బాగ్, సుభాష్ నగర్ తందూరీ, టిక్కాలకు ఫేమస్. తాజా ఆదేశాలతో అక్కడ బొగ్గుల స్థానంలో గ్యాస్, ఎలక్ట్రిక్ పొయ్యిలు వాడుతున్నారు.


