News August 5, 2024
టీచర్లూ.. పుస్తకాల్లో తప్పులుంటే చెప్పండి: SCERT కొత్త ప్రయోగం

TG: 1-10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తప్పులు దొర్లకుండా రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల సేవల్ని వినియోగించుకునే సరికొత్త ప్రయోగానికి విద్యా పరిశోధన, శిక్షణ మండలి శ్రీకారం చుట్టింది. సబ్జెక్ట్ నిపుణులు, డైట్, ప్రభుత్వ బీఈడీ కళాశాలల అధ్యాపకులు తప్పులుంటే గుర్తించి పంపేలా చర్యలు తీసుకోవాలని DEOలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఇటీవల పాఠ్యపుస్తకాల్లో పాత మంత్రుల పేర్లు ముద్రించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
Similar News
News December 14, 2025
KCRకి ఉన్న చరిష్మా వాళ్లెవరికీ లేదు: టీపీసీసీ చీఫ్

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. ‘KCRకి ఉన్న చరిష్మా వాళ్ల కుటుంబంలో ఎవరికీ లేదు. పార్టీని నడపడం KTR వల్ల కాదు. BRSను హరీశ్ చీల్చుతాడు. ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటే కవిత ఎందుకు బయటకొస్తుంది. KTR డబ్బులు పెట్టి సోషల్ మీడియాతో నడిపిస్తున్నాడు’ అని మీడియా చిట్చాట్లో పేర్కొన్నారు. CBN పెట్టుబడులు పెట్టాలని ఎంత ప్రచారం చేసినా ఇన్వెస్టర్లు HYD వైపే చూస్తున్నారని అన్నారు.
News December 14, 2025
15 రోజుల్లో ‘అవుకు’ లీకేజీలకు మరమ్మతు పూర్తి : జనార్దన్ రెడ్డి

AP: నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ను మంత్రి జనార్దన్ రెడ్డి సందర్శించారు. ‘15 ఏళ్లుగా రిజర్వాయర్లో లీకేజీల సమస్య ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. లీకేజీలు లేకుండా మరమ్మతు చేయిస్తున్నాం. ఇప్పటికే నిపుణులు వాటిని గుర్తించి కాంక్రీట్తో ఫిల్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు. ఇటీవల కట్ట కొద్దిగా కుంగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. 15 రోజుల్లో పనులు పూర్తవుతాయని, భయపడొద్దని సూచించారు.
News December 14, 2025
ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మ.2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, సా.5గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశముంది. రెండో విడతలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ వే2న్యూస్లో తెలుసుకోవచ్చు.


