News August 5, 2024
టీచర్లూ.. పుస్తకాల్లో తప్పులుంటే చెప్పండి: SCERT కొత్త ప్రయోగం

TG: 1-10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తప్పులు దొర్లకుండా రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల సేవల్ని వినియోగించుకునే సరికొత్త ప్రయోగానికి విద్యా పరిశోధన, శిక్షణ మండలి శ్రీకారం చుట్టింది. సబ్జెక్ట్ నిపుణులు, డైట్, ప్రభుత్వ బీఈడీ కళాశాలల అధ్యాపకులు తప్పులుంటే గుర్తించి పంపేలా చర్యలు తీసుకోవాలని DEOలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఇటీవల పాఠ్యపుస్తకాల్లో పాత మంత్రుల పేర్లు ముద్రించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
Similar News
News December 14, 2025
24 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు: టీడీపీ ఎమ్మెల్యే

AP: 2025-26 ఖరీఫ్ సీజన్లో ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు TDP ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. 3.24 లక్షల రైతుల ఖాతాల్లో రూ.4,609 కోట్లు జమ చేయడం ఓ రికార్డని చెప్పారు. 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.12,200 కోట్ల విలువైన 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
News December 14, 2025
మత్తు ఇంజెక్షన్తో నడుం నొప్పి వస్తుందా?

సీ సెక్షన్ డెలివరీ చేసేటప్పుడు మహిళలకు మత్తు ఇంజెక్షన్(అనస్థీషియా) ఇస్తారు. అయితే ఈ సూదిని వెన్నెముకకు ఇస్తారని, దీనివల్ల నడుంనొప్పి వస్తుందని కొందరు అనుకుంటారు. కానీ ఇది అపోహే అంటున్నారు వైద్యులు. ఈ ఇంజెక్షన్ నేరుగా వెన్నెముకలోని ఎముకకు ఇవ్వరని చెబుతున్నారు. డెలివరీ తర్వాత వీపు వెనుక ఎలాంటి సపోర్ట్ లేకుండా పాలివ్వడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల నడుం నొప్పి వస్తుందంటున్నారు.
News December 14, 2025
‘నల్లమల సాగర్’పై సుప్రీంలో ఏపీ కేవియట్!

AP: పోలవరం-నల్లమల సాగర్ సాగునీటి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగానే కేవియట్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్కు అప్పగించింది. కాగా ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. L1గా వచ్చిన సంస్థకు బాధ్యతలు అప్పగిస్తారు.


