News June 28, 2024
టీచర్లు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సిందే: సుప్రీంకోర్టు

దేశ నిర్మాణంలో కీలకమైన టీచర్లు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇష్టంలేనివారు ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలంది. బిహార్లో స్థానిక సంస్థల ద్వారా 4 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారు. వీరికి స్కూల్ టీచర్ల హోదా కల్పించేందుకు పరీక్ష నిర్వహిస్తుండగా, దీన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంను ఆశ్రయించారు. పరీక్ష రాయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
Similar News
News December 10, 2025
NTPCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.
News December 10, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

⭒ నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం
⭒ 2047 నాటికి HYDలో 623kms మేర మెట్రో నెట్వర్క్ను విస్తరించనున్నట్లు విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న ప్రభుత్వం
⭒ యువతకు అడ్వాన్స్డ్ స్కిల్స్పై శిక్షణ, ఉపాధి కల్పనపై టాటా టెక్, అపోలో సహా పలు సంస్థలతో ప్రభుత్వం రూ.72కోట్ల విలువైన 9 ఒప్పందాలు


