News July 26, 2024
చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్లో వరుసగా 9వ సారి టీమ్ ఇండియా ఫైనల్స్కు అర్హత సాధించింది. దీంతో టోర్నీలో ప్రతిసారి ఫైనల్స్కు చేరిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు 8 ఫైనల్స్ ఆడగా 7 సార్లు విజేతగా నిలిచింది. ఓసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఇప్పుడు మరోసారి తుదిపోరుకు సిద్ధమైంది.
Similar News
News January 16, 2026
ఆదివారం పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు

ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్లు BSE, NSE ప్రకటించాయి. ఆరోజు ఆదివారం అయినప్పటికీ.. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. టైమింగ్స్(9:15 am-3:30 pm)లోనూ ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాయి. దేశ చరిత్రలో బహుశా ఇలా ఆదివారం మార్కెట్లు పనిచేయడం ఇదే తొలిసారి అయి ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
News January 16, 2026
రోహిత్ కెప్టెన్సీకి గంభీర్ చెక్.. మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు!

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేయడం వెనుక కోచ్ గంభీర్ హస్తం ఉండొచ్చని మనోజ్ తివారీ అనుమానం వ్యక్తం చేశారు. అగార్కర్ కోచ్ ప్రభావానికి లోనై ఉండొచ్చేమోనని, రోహిత్ లాంటి లెజెండ్ను పక్కన పెట్టడం క్రీడా ధర్మానికి విరుద్ధమన్నారు. 2027 వరల్డ్ కప్ ఆడగల సత్తా ఉన్న హిట్మ్యాన్ను కాదని గిల్కు బాధ్యతలు ఇవ్వడంలో లాజిక్ లేదన్నారు. ఇది రోహిత్ను అవమానించడమేనని ఫైర్ అయ్యారు.
News January 16, 2026
APFIRST పేరుతో తిరుపతిలో రీసెర్చ్ సెంటర్

AP ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ(APFIRST) పేరిట తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు కానుంది. ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమావేశంలో CM CBN దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్, క్వాంటం, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ కీలకం కానున్నాయి. ఈదిశగా పాలసీలు పెడుతున్నాం. IIT-IISER ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు కానుంది’ అని తెలిపారు.


