News October 13, 2024

చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

image

బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిరీస్‌లు క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 34 సిరీస్‌లు ఆడి 10 సిరీస్‌ల్లో ప్రత్యర్థిని వైట్ వాష్ చేసింది. టీమ్ ఇండియా తర్వాత పాకిస్థాన్ (8), అఫ్గానిస్థాన్ (6), ఆస్ట్రేలియా (5), ఇంగ్లండ్ (4) ఉన్నాయి.

Similar News

News October 13, 2024

బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలు మూతపడేది ఎప్పుడంటే?

image

శీతాకాలం ప్రారంభం అవుతుండటంతో ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల మూసివేత తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది. NOV 17న బద్రీనాథ్, కేదార్‌నాథ్, నవంబర్ 3న యమునోత్రి, గంగోత్రి ఆలయ తలుపులను మూసివేయనున్నారు. అలాగే రుద్రనాథ్ ప్రవేశద్వారాలు ఈ నెల 17న క్లోజ్ చేస్తారు. ఈ ఏడాది బద్రీనాథ్‌ను 11 లక్షల మంది, కేదార్‌నాథ్‌ను 13.5 లక్షల మంది దర్శించుకున్నారు. శీతాకాలంలో ఈ ఆలయాలు మంచుతో కప్పబడి ఉంటాయి.

News October 13, 2024

దసరా వేడుకల్లో విషాదం

image

AP: కోనసీమ, కడప జిల్లాల్లో దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా అమలాపురం మండలం కొంకాపల్లిలో డీజే సౌండ్‌కు వినయ్ అనే యువకుడు డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడు. మరోవైపు కడపలోని బెల్లంబండి వీధిలో దసరా ఊరేగింపులో పందిరి పైభాగానికి విద్యుత్ తీగలు తగిలాయి. షాక్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.

News October 13, 2024

ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన 34 ప్రపంచ దేశాలు

image

లెబ‌నాన్‌లోని UN శాంతిప‌రిర‌క్ష‌ణ బ‌ల‌గాల స్థావ‌రాలపై ఇజ్రాయెల్ దాడుల‌ను భార‌త్‌తోపాటు 34 ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇలాంటి చ‌ర్య‌ల‌ను వెంట‌నే విర‌మించుకోవాల‌ని సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. ఇటీవ‌ల ద‌క్షిణ లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ జ‌రిపిన‌ దాడుల్లో ఐదుగురు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య‌లుగా UNIFIL ఆరోపించింది. బ‌ల‌గాల ర‌క్ష‌ణ అత్యంత ప్రాధాన్యాంశంగా భార‌త్ పేర్కొంది.