News June 28, 2024
TEAM INDIA: ఇంగ్లండ్కూ ఇచ్చిపడేసింది!

రెండేళ్ల కింద జరిగిన ఘోర పరాభవానికి టీమ్ ఇండియా రివేంజ్ తీర్చుకుంది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో 10 వికెట్ల తేడాతో భారత్ను ఇంగ్లండ్ చిత్తుగా ఓడించింది. దీంతో టీమ్ ఇండియా అవమానకరరీతిలో ఆ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. ఈ విజయంతో భారత ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.
Similar News
News December 4, 2025
కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ ఢమాల్.!

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. జిల్లాలో 12 SROలు ఉన్నాయి. వీటి ద్వారా 2025-26లో రూ.411.74 కోట్లు టార్గెట్ కాగా.. నవంబరు నాటికి రూ.181.73 కోట్లు మాత్రమే వచ్చింది. బద్వేల్-9.48, జమ్మలమడుగు-10.37, కమలాపురం-8.60, ప్రొద్దుటూరు-40.47, మైదుకూరు-7.10, ముద్దనూరు-3.44, పులివెందుల-11.96, సిద్దవటం-2.45, వేంపల్లె-6.14, దువ్వూరు-2.55, కడప-79.13 కోట్లు వచ్చింది.
News December 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 86 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
సమాధానం: మధుర మీనాక్షి అమ్మవారు. ఈ దేవత ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని మధురలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 4, 2025
బొగ్గు గనుల నుంచి విష వాయువులు

ఝార్ఖండ్లోని ధన్బాద్ జిల్లా కేందౌది బస్తీ ప్రాంతంలోని బొగ్గు గనుల నుంచి విష వాయువులు వెలువడుతున్నాయి. ఇప్పటికే స్థానికంగా ఒక మహిళ మరణించగా 12 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలోని 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డేంజర్ జోన్లో ఉన్న ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. 3 అంబులెన్సులను ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంచినట్లు తవ్వకాలు జరుపుతున్న BCCL ప్రతినిధి తెలిపారు.


