News August 2, 2024
టీమ్ ఇండియాలో గ్రూపులు లేవు: సూర్య

టీమ్లో గ్రూపులు లేవని భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ‘T20WC ప్రారంభమైనప్పటి నుంచి ప్లేయర్లమంతా ఎప్పుడూ విడివిడిగా కూర్చోలేదు, టీమ్గానే ఉంటున్నాం’ అని సూర్య వెల్లడించారు. ఈ వ్యాఖ్యల్ని అజయ్ జడేజా, నెహ్రా తప్పుపట్టారు. గతంలో జట్టుగా కలిసి కూర్చోలేదా? ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టినట్లు సూర్య చెబుతున్నారని జడేజా విమర్శించగా, ఈ మార్పునకు ఇంత టైమ్ ఎందుకు పట్టిందని నెహ్రా ప్రశ్నించారు.
Similar News
News November 23, 2025
DEC నెలాఖరుకు రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు: చంద్రబాబు

AP: డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు దర్శనమివ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. R&B రహదారుల అభివృద్ధిపై ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్లను ఆదేశించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోనే రూ.2500 కోట్లతో 5,471KM రోడ్ల అభివృద్ధికి అనుమతులిచ్చామన్నారు.
News November 22, 2025
టెర్రర్ మాడ్యూల్.. మరో కీలక నిందితుడి అరెస్ట్

ఢిల్లీ పేలుడు-టెర్రర్ మాడ్యూల్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పుల్వామాలో ఎలక్ట్రీషియన్గా పనిచేసే తుఫైల్ అహ్మద్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితుడు డా.ముజఫర్ ఆగస్టులోనే దేశం విడిచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు అఫ్గాన్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టైన డాక్టర్లకు, జైషే మహ్మద్ హ్యాండర్లకు అతడే మధ్యవర్తిత్వం వహించినట్లు భావిస్తున్నారు.
News November 22, 2025
అప్పుగా తెచ్చిన ₹2.30L కోట్లు ఏమయ్యాయ్: KTR

TG: అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న CM క్షమాపణలు చెప్పాలని KTR డిమాండ్ చేశారు. నెలకు ₹2300 CR కూడా లేని వడ్డీని ₹7వేల కోట్లుగా అబద్ధాలు చెబుతున్నట్లు ‘కాగ్’ నివేదిక బట్టబయలు చేసిందని చెప్పారు. BRS పదేళ్లలో ₹2.8L కోట్ల రుణం తెస్తే కాంగ్రెస్ 23నెలల్లోనే ₹2.30L కోట్లు అప్పు చేసిందని దుయ్యబట్టారు. కొత్త ప్రాజెక్టులు నిర్మించలేదని, అప్పు తెచ్చిన రూ.లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.


