News May 31, 2024
USలో టీమ్ ఇండియాకు వసతులు కరవు!
టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లిన భారత జట్టుకు వసతులు కరవైనట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ చేయడానికి కూడా కనీస సౌకర్యాలు లేవని సమాచారం. ఈ ఏర్పాట్లపై టీమ్ ఇండియా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు టాక్. దీనిపై ఇప్పటికే ఐసీసీ స్పందించి సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుంది. అదే నెల 9న పాకిస్థాన్తో తలపడనుంది.
Similar News
News October 14, 2024
పంచాయతీలను జగన్ నిర్వీర్యం చేశారు: నిమ్మల
AP: సంక్రాంతిలోపు 3వేల కి.మీల సిమెంట్ రోడ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోరింటాడలో పల్లెపండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీ నిధుల్ని దారి మళ్లించిన జగన్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు. పంచాయతీలను నిర్వీర్యం చేసి, సర్పంచులను భిక్షాటన చేసే దుస్థితికి తెచ్చారని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు.
News October 14, 2024
డీఎస్సీ ఫ్రీ కోచింగ్.. ఆ అభ్యర్థులకు గమనిక
AP: డీఎస్సీ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఈ నెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అప్లై చేసిన వారు జ్ఞానభూమి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలంది. ఈ నెల 27న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపింది. అర్హులను ఎంపిక చేసి శిక్షణ అందిస్తామంది.
News October 14, 2024
‘కంగువ’ డబ్బింగ్ కోసం అధునాతన టెక్నాలజీ!
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ వచ్చే నెల 14వ తేదీన ఎనిమిది భాషల్లో రిలీజ్ కానుంది. అయితే, దీనికోసం మూవీ టీమ్ డబ్బింగ్ ఆర్టిస్టును ఉపయోగించలేదు. దర్శకుడు శివ అతని బృందం అధునాతన AI సాంకేతికతను ఉపయోగించినట్లు సినీవర్గాలు తెలిపాయి. సూర్య వాయిస్ని ప్రతి భాషలో AI డబ్బింగ్ చేసినట్లు పేర్కొన్నాయి. కాగా, ఈనెల 20న జరిగే ఆడియో లాంచ్కు సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రభాస్లను ఆహ్వానించినట్లు సమాచారం.