News December 10, 2024

టీమ్ ఇండియా ప్లేయర్ సుదర్శన్‌కు సర్జరీ

image

టీమ్ ఇండియా క్రికెటర్ సాయి సుదర్శన్‌కు సర్జరీ జరిగింది. ‘నాకు శస్త్రచికిత్స చేసిన వైద్యులకు, చేయించిన బీసీసీఐకి, అండగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు’ అంటూ ఆయన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. కాగా IPL మెగావేలానికి ముందే సుదర్శన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.8.50 కోట్లకు రిటైన్ చేసుకుంది.

Similar News

News December 5, 2025

క్రియేటివ్ సిటీగా అమరావతి: చంద్రబాబు

image

AP: అమరావతిలో నిర్మించే ప్రతి భవనం విలక్షణంగా ఉండాలని, పచ్చదనంతో ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలని CRDA భేటీలో CM CBN సూచించారు. మౌలిక సదుపాయాల కోసం నాబార్డు ₹7,380 కోట్ల రుణానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. నాణ్యతలో రాజీపడకుండా గడువుకన్నా ముందే నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

News December 5, 2025

మోదీ-పుతిన్ నవ్వులు.. ఎక్కడో మండుతున్నట్టుంది!

image

పుతిన్ భారత పర్యటనతో US అధ్యక్షుడు ట్రంప్‌కు ‘ఎక్కడో మండుతున్నట్టుంది’ అంటూ ఇండియన్ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ట్రంప్ ఫొటోలతో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మోదీ-పుతిన్ నవ్వులు చూసి ఆయన ఏడుస్తుంటారని పోస్టులు పెడుతున్నారు. టారిఫ్స్ ఇంకా పెంచుతాడేమోనని సెటైర్లు వేస్తున్నారు. రష్యాతో సంబంధాలు పెంచుకున్నామనే అక్కసుతోనే ట్రంప్ మనపై అధిక టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే.

News December 5, 2025

స్క్రబ్ టైఫస్‌ పట్ల ఆందోళన వద్దు: హెల్త్ కమిషనర్

image

AP: స్క్రబ్ టైఫస్ జ్వరాల పట్ల ఆందోళన అవసరం లేదని హెల్త్ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. 2023 నుంచి కేసులు నమోదవుతున్నాయని, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది NOV 30 వరకు 736 స్క్రబ్ టైఫస్ కేసులు రికార్డయినట్టు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. శరీరంపై నల్లమచ్చ కనిపించి జ్వరం, తలనొప్పి వస్తే అలర్ట్ కావాలన్నారు. చిగ్గర్ మైటు అనే పురుగు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు.