News October 30, 2024

ఆఖరి టెస్టు కోసం టీమ్ ఇండియా కసరత్తు

image

న్యూజిలాండ్‌తో జరగబోయే చివరి టెస్టు కోసం టీమ్ ఇండియా తీవ్ర కసరత్తులు చేస్తోంది. భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. కెప్టెన్‌ రోహిత్‌తోపాటు కోహ్లీ, బుమ్రా, జడేజా, ఆకాశ్ దీప్ తదితర ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. కాగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టులో ఆడిన జట్టుతోనే రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 8, 2026

ఆ పోర్నోగ్రఫీ చూసినా, షేర్ చేసినా జైలుకే!

image

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వారిని TG సైబర్ సెక్యూరిటీ బ్యూరో ట్రేస్ చేస్తోంది. వీడియోలను చూస్తూ, షేర్ చేస్తున్న ఓ వ్యక్తిని ఖమ్మం పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ సంస్థ ‘సైబర్ టిప్ లైన్’ ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీ బ్రౌజింగ్‌పై పోలీసులకు అలర్ట్స్ పంపిస్తుంటుంది. గతేడాది TGకి 97,556 అలర్ట్స్ వచ్చాయి. 854 FIRలు నమోదవగా, 376 మంది అరెస్టయ్యారు.

News January 8, 2026

విజయ్ మూవీ వాయిదా.. టికెట్ మనీ రిఫండ్

image

తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కొత్త రిలీజ్ తేదీని కూడా ప్రకటించకపోవడంతో BMS టికెట్లు కొన్నవారికి రిఫండ్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడైన 4.5లక్షల టికెట్ల అమౌంట్‌ను తిరిగిచ్చేస్తోంది. దీంతోపాటు ప్రమోషన్లు, థియేటర్ల అగ్రిమెంట్ల రూపంలో మేకర్స్‌కు రూ.50కోట్ల వరకూ నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం.

News January 8, 2026

భారత మాజీ కోచ్‌లపై కన్నేసిన శ్రీలంక

image

T20 WCలో రాణించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు పలు కీలక నియామకాలు చేపడుతోంది. ఇప్పటికే టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌ను అపాయింట్ చేసుకున్న ఆ జట్టు, తాజాగా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌నూ తాత్కాలిక బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. JAN 18 నుంచి MAR 10 వరకు ఆయన SL జట్టుకు కోచ్‌గా ఉండనున్నారు. ఫిబ్రవరి 7న WC ప్రారంభం కానుంది. కాగా IPLలో RR టీమ్‌కు విక్రమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు.