News October 30, 2024
ఆఖరి టెస్టు కోసం టీమ్ ఇండియా కసరత్తు

న్యూజిలాండ్తో జరగబోయే చివరి టెస్టు కోసం టీమ్ ఇండియా తీవ్ర కసరత్తులు చేస్తోంది. భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. కెప్టెన్ రోహిత్తోపాటు కోహ్లీ, బుమ్రా, జడేజా, ఆకాశ్ దీప్ తదితర ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. కాగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టులో ఆడిన జట్టుతోనే రోహిత్ సేన ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 9, 2026
పుట్టుకతో కుబేర యోగం ఎలా కలుగుతుంది?

జాతక చక్రంలో ధన స్థానమైన 2వ ఇల్లు, లాభ స్థానమైన 11వ ఇల్లు చాలా కీలకం. ఈ 2 స్థానాల అధిపతులు తమ స్వక్షేత్రాల్లో లేదా ఉచ్ఛ స్థితిలో ఉండి, ఒకరినొకరు వీక్షించుకున్నా లేదా కలిసి ఉన్నా కుబేర యోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా గురు, శుక్ర గ్రహాల అనుకూలత ఈ యోగానికి బలాన్ని ఇస్తుంది. లగ్నాధిపతి బలంగా ఉండి ఎనిమిది, పన్నెండో స్థానాలతో శుభ సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా ఈ యోగం ఏర్పడి వ్యక్తిని ధనవంతుడిని చేస్తుంది.
News January 9, 2026
ALERT: ఆ పత్తి విత్తనాలు కొనొద్దు

TG: కేంద్రం అనుమతి లేని HT(Herbicide tolerant) పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ పత్తి రకాన్ని అమెరికాకు చెందిన మోన్సాంటో కంపెనీ అభివృద్ధి చేసింది. అయితే ఫీల్డ్ ట్రయల్స్లో ఇవి విఫలమవ్వడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందని ఈ విత్తనాల వినియోగానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. రైతులు వీటిని కొని ఇబ్బందిపడొద్దని మంత్రి సూచించారు.
News January 9, 2026
నేటి నుంచి WPL.. MI, RCB మధ్య తొలి మ్యాచ్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL-2026) నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో ఛాంపియన్ టీమ్స్ ముంబై, బెంగళూరు తలపడనున్నాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో 7.30PMకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. MIకి హర్మన్ ప్రీత్, RCBకి స్మృతి మంధాన కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 3 సీజన్లు జరగగా MI రెండు సార్లు (2023, 25), RCB (2024) ఒకసారి టైటిల్ గెలిచాయి. హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్లో లైవ్ చూడవచ్చు.


