News February 15, 2025

నేడు దుబాయ్‌కి టీమ్ ఇండియా?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియా ఇవాళ దుబాయ్ పయనం కానున్నట్లు తెలుస్తోంది. ముంబై నుంచి జట్టు ఆటగాళ్లు దుబాయ్ ఫ్లైట్ ఎక్కుతారని సమాచారం. ఫిబ్రవరి 19 నుంచి మెగా లీగ్ ప్రారంభం కానుంది. 20న బంగ్లాదేశ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. భారత్ తమ మ్యాచులన్నీ దుబాయ్‌లోనే ఆడుతుంది. భారత్ ఒకవేళ సెమీఫైనల్, ఫైనల్‌కు వెళ్తే ఆ మ్యాచులూ ఇక్కడే జరుగుతాయి.

Similar News

News January 18, 2026

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

image

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<>AIIA<<>>) 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, BE/BTech/MCA/BSc, డిప్లొమా, MCom/MBA, MSc(నర్సింగ్), BCom/BBA, BSc(బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), డిగ్రీ(యోగా), DMLT, పంచకర్మ(డిప్లొమా), ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 3. వెబ్‌సైట్: https://aiia.gov.in

News January 18, 2026

చైనాలో నోరోవైరస్ కలకలం.. కొత్తదేనా?

image

చైనాలోని ఓ స్కూల్‌లో 100 మందికి పైగా విద్యార్థులు నోరోవైరస్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. 1968లోనే USలో బయటపడింది. భారత్‌లో కూడా గతంలో కేరళ, పుణే వంటి నగరాల్లో ఈ వైరస్ కలకలం రేపింది. ఆహారం, నీరు లేదా సోకిన వ్యక్తి ద్వారా ఇది వేగంగా వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రాణాపాయం తక్కువే. అయినా తీవ్రమైన నీరసం, డీహైడ్రేషన్, డయేరియాతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News January 18, 2026

ఆర్టీసీకి భారీ ఆదాయం.. 5 రోజుల్లో రూ.67కోట్లు

image

TG: సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఛార్జీల ద్వారా రూ.67.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రోజుకి సగటున రూ.13.48కోట్లు వచ్చాయని తెలిపారు. ఆర్టీసీ 6,431 స్పెషల్ బస్సులను నడపగా, రోజుకి అదనంగా రూ.2.70కోట్లు వీటి ద్వారానే సమకూరినట్లు చెప్పారు. ఇవాళ, రేపు కూడా స్పెషల్ బస్సులు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.