News May 19, 2024
సాంకేతిక లోపం.. అకౌంట్లో ₹9,999 కోట్లు

బ్యాంక్ తప్పిదం వల్ల ఓ వ్యక్తి ఖాతాలో ఏకంగా ₹9,999 కోట్లు దర్శనమిచ్చాయి. ఉత్తర్ప్రదేశ్లోని బదోహీ జిల్లాలో భాను ప్రకాశ్ అనే వ్యక్తికి బరోడా యూపీ బ్యాంక్లో కిసాన్ క్రిడెట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. అతడు బ్యాలెన్స్ చెక్ చేసుకోగా ఒక్కసారిగా ₹99,99,94,95,999.99 దర్శనమివ్వడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అకౌంట్ NPAగా మారి సాంకేతిక లోపంతో అంత మొత్తం చూపించిందని వివరించారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


