News December 18, 2024
కేంద్ర మంత్రి విమానంలో సాంకేతిక లోపం

AP: నేడు విశాఖలో జరగాల్సిన ‘ఐఎన్ఎస్ నిర్దేశక్’ నౌక జాతికి అంకితం కార్యక్రమం మధ్యాహ్నానికి వాయిదా పడింది. కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ ఉదయం విశాఖ చేరుకోవాల్సి ఉండగా, ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో పాటు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానం హైదరాబాద్కు మళ్లించారు. కేంద్ర మంత్రి మధ్యాహ్నం విశాఖ చేరుకోనున్నారు.
Similar News
News October 26, 2025
అత్యధిక రన్స్ చేసిన భారత ఓపెనర్గా రోహిత్

నిన్న ఆస్ట్రేలియాపై సెంచరీతో అదరగొట్టిన రోహిత్ అరుదైన రికార్డు సాధించారు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్గా నిలిచారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించారు. రోహిత్ 15,787 రన్స్ చేయగా, ఆ తర్వాత సెహ్వాగ్ (15,758), సచిన్ (15,335) పరుగులు చేశారు. రోహిత్ 2007లోనే భారత్ తరఫున అరంగేట్రం చేసినా అంతగా రాణించలేదు. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తాక రికార్డులు కొల్లగొట్టారు.
News October 26, 2025
మొంథా తుఫాను.. ప్రజలకు జగన్ సూచనలు

AP: మొంథా తుఫాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని YCP అధినేత జగన్ సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలను NOV 4కు వాయిదా వేసినట్లు వైసీపీ వెల్లడించింది.
News October 26, 2025
వైద్యురాలు ఆత్మహత్య.. BJPపై రాహుల్ ఫైర్

మహారాష్ట్రలో SI రేప్ చేశాడని వైద్యురాలు <<18091644>>సూసైడ్<<>> చేసుకోవడంపై LoP రాహుల్గాంధీ స్పందించారు. ‘ఎలాంటి సివిలైజ్డ్ సొసైటీనైనా కదిలించే విషాదమిది. అవినీతి వ్యవస్థలో స్థిరపడిన క్రిమినల్స్ చేతిలో ఆమె బలైంది. ప్రజలను రక్షించాల్సినవారే ఘోరానికి పాల్పడ్డారు. దీని వెనుక BJP నేతలు, సంపన్నులు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ అమానవీయ ముఖాన్ని ఇది బయటపెట్టింది. దేశంలోని ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.


