News July 20, 2024

పరీక్ష కేంద్రాల ఆప్షన్ నమోదులో సాంకేతిక సమస్య

image

నీట్-పీజీ పరీక్ష కేంద్రాల ఆప్షన్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వెబ్‌సైట్‌లో కేంద్రాల ఆప్షన్ ఇచ్చుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోంది. ఎల్లుండి గడువు ముగియనుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీనికి అధికారులు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Similar News

News November 28, 2025

కృష్ణా: నాడు – నేడు పనులు.. పూర్తి చేస్తే బాగు..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు 90% పూర్తైనా, కూటమి ప్రభుత్వం వచ్చాక నిధుల లేమి కారణంగా అసంపూర్తిగా మారాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 175, కృష్ణాలో 100కు పైగా పాఠశాలల్లో మౌలిక వసతులు, 600 స్కూళ్లలో పెయింటింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది.

News November 28, 2025

3,058 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

రైల్వేలో ఇంటర్ అర్హతతో 3,058 NTPC (UG) పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. దరఖాస్తుకు ఈనెల 27 ఆఖరు తేదీకాగా.. DEC 4వరకు పొడిగించారు. ఫీజు చెల్లించడానికి DEC 6వరకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తులో తప్పుల సవరణ DEC 7-16 వరకు చేసుకోవచ్చు. వయసు 18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. www.rrbcdg.gov.in/

News November 28, 2025

సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన <<18403510>>జీవో 46ను<<>> సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ దశలో సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టుల జోక్యం ఉండదన్న ఈసీ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది.