News May 22, 2024

యూట్యూబ్‌లో సాంకేతిక సమస్య!

image

యూట్యూబ్‌లో వ్యూయర్ షిప్ ఒక్కసారిగా పడిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. లైవ్ వీడియోలకు వేలల్లో ఉండాల్సిన సంఖ్య కేవలం సింగిల్, డబుల్ డిజిట్లలోనే దర్శనమిస్తోందని పేర్కొంటున్నారు. యూట్యూబ్‌కు ఏమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారత్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నట్లు మరికొందరు చెబుతున్నారు.

Similar News

News October 24, 2025

19 మృతదేహాలు వెలికితీత

image

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బస్సులో ఇద్దరు పిల్లలు సహా మొత్తం 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రయాణించినట్లు తెలిపారు. 21 మంది సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News October 24, 2025

భారీగా తగ్గిన వెండి ధరలు

image

వరుసగా నాలుగో రోజు కూడా వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై ధర రూ.3 వేలు తగ్గి రూ.1,71,000 వద్ద కొనసాగుతోంది. నాలుగు రోజుల్లోనే సిల్వర్ ధరలు కిలోకి రూ.19 వేలు తగ్గడం గమనార్హం. అటు బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24K బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.1,25,460 వద్ద కొనసాగుతోంది. 22K 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.1,15,000గా ఉంది.

News October 24, 2025

మద్దతు ధరపై పత్తి రైతుల్లో ఆందోళన

image

ఈ ఏడాది పత్తి పంట క్వింటాకు రూ.8,110 మద్దతు ధరగా నిర్ణయించారు. సీసీఐ నిబంధనలకు అనుగుణంగా పంటలో తేమ, నాణ్యత ఉంటేనే ఈ ధర వస్తుంది. పత్తిలో గరిష్ఠంగా 8-12% తేమనే CCI అనుమతిస్తోంది. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలు, చీడపీడల వల్ల ఈసారి పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో పాటు నాణ్యత కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీని వల్ల మద్దతు ధర దక్కుతుందో? లేదో? అనే ఆందోళన పత్తి రైతుల్లో నెలకొంది.