News February 5, 2025

తీన్మార్ మల్లన్నపై వేటు?

image

TG: ఎమ్మెల్సీ నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)పై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ కులగణన, ఇతర అంశాల్లో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకొని మల్లన్న చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల ఆగ్రహానికి దారి తీశాయి. ఇవాళ ఇదే విషయమై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.

Similar News

News December 4, 2025

భక్తుల రద్దీ కారణంగా ఈనెల 8 వరకు స్పర్శ దర్శనం నిలుపుదల

image

భక్తుల రద్దీ కారణంగా ఈనెల 8 వరకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు, ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 1 నుంచి 5వ తేదీ వరకు శివదీక్ష విరమణ సందర్భంగా శ్రీశైలానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరికీ కేవలం అలంకార దర్శినానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. 5 తేదీ వరకు గర్భాలయ, సామూహిక అభిషేకాలు కొనసాగుతాయన్నారు.

News December 4, 2025

అక్రమ మద్యం, నగదు పంపిణీపై నిఘా: జగిత్యాల ఎస్పీ

image

గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ అధికారులకు ఆదేశించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన, అక్రమ మద్యం, నగదు, ఉచితాల పంపిణీపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి స్టేషన్ పరిధిలో సర్ప్రైజ్ చెకింగ్ చేయాలని తెలిపారు. సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టినా, షేర్ చేసినవారితో పాటు గ్రూప్ అడ్మిన్‌లపై కూడా కేసులు నమోదు చేయాలన్నారు.

News December 4, 2025

భక్తుల రద్దీ కారణంగా ఈనెల 8 వరకు స్పర్శ దర్శనం నిలుపుదల

image

భక్తుల రద్దీ కారణంగా ఈనెల 8 వరకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు, ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 1 నుంచి 5వ తేదీ వరకు శివదీక్ష విరమణ సందర్భంగా శ్రీశైలానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరికీ కేవలం అలంకార దర్శినానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. 5 తేదీ వరకు గర్భాలయ, సామూహిక అభిషేకాలు కొనసాగుతాయన్నారు.