News February 22, 2025

ఆగస్టు 1న తేజా సజ్జ ‘మిరాయ్’ విడుదల

image

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న ‘మిరాయ్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్‌గా, మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలున్నాయి.

Similar News

News November 4, 2025

రేపే కార్తీక పౌర్ణమి.. ఏమేం చేయాలంటే?

image

కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నదీ స్నానమాచరించి, శివలింగానికి రుద్రాభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘నదీ స్నానం చేయలేనివారు గంగా జలం కలిపిన నీటితో స్నానం చేయవచ్చు. ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసినా, ఆయన కథ విన్నా శుభం కలుగుతుంది. తులసి పూజతో పాటు 365 వత్తులతో దీపం వెలిగించాలి. శివాలయంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం’ అని అంటున్నారు.
☞ కార్తీక పౌర్ణమి గురించి మరిన్ని విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 4, 2025

కార్తీక పౌర్ణమి: ఉపవాసం ఎలా ఉండాలి?

image

‘కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండడం మంచిది. అది వీలుకాకపోతే దేవుడిపై మనసు లగ్నం చేస్తూ మితంగా ఆహారం తీసుకోవచ్చు. వాయుపురాణం ప్రకారం.. పెసరపప్పు-బియ్యం కలిపి వండిన పదార్థాన్ని ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు. సహజ ఫలాలు, నువ్వులు-బెల్లం ఉండలు, పంచామృతం, తులసినీరు వంటివి కూడా స్వీకరించవచ్చు. అయితే, ఏ ఆహారాన్నైనా ఒకసారి మాత్రమే తీసుకోవడం ఉత్తమం. మాటిమాటికి వద్దు’ అని పండితులు సూచిస్తున్నారు.

News November 4, 2025

మాగాణి భూముల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు

image

వరి మాగాణి భూముల్లో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు, శనగ, పెసలు, మినుము, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కూరగాయలు, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి సాగు వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతులకు విభిన్న పంటలతో ఆదాయం పెరుగుతుంది. వరి పంటపై ఆధారపడటం తగ్గుతుంది.