News December 1, 2024
Dec 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

TG: డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేస్తామని సీఎం చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో దాని విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలు చేస్తున్న, అమలు చేయాల్సిన పలు సంక్షేమ పథకాలపై చర్చించే ఛాన్స్ ఉంది.
Similar News
News December 25, 2025
ఇంజినీరింగ్ ఫీజుల్లో మార్పులు.. జీవో జారీ

AP: హైకోర్టు తుది తీర్పుకు అనుగుణంగా ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు చేస్తూ ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేసింది. దీని ప్రకారం కనిష్ఠంగా రూ.40వేల నుంచి గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు ఫీజు ఉండనుంది. 7 కాలేజీలకు మాత్రమే స్వల్పంగా ఫీజులు పెరిగాయి. ఫీజురీయింబర్స్మెంట్ పథకం కింద అడ్మిషన్లు పొందిన వారికి 2024-25 నుంచి మూడేళ్ల కాలానికి ఇవే ఫీజులు అమలవుతాయి. కాగా గతంలో కనీస ఫీజు రూ.43వేలుగా ఉండేది.
News December 25, 2025
గర్భనిరోధక మాత్రలతో బరువు పెరుగుతారా?

గర్భనిరోధక మాత్రల వల్ల శరీరంలో కొన్ని రకాల ద్రవాలు నిలిచిపోవడం, శరీరంలో నీటి పరిమాణం పెరగడం వల్ల కాస్త బరువు పెరగవచ్చు. అంతే కాకుండా కొవ్వు లేదా కండర ద్రవ్యరాశి పెరగడానికి కూడా ఇది కారణం అవుతుంది. మరోవైపు కొంతమంది మహిళలు ఈ టాబ్లెట్ తీసుకునేటప్పుడు బరువు కూడా తగ్గుతారు. ఈ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు, ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి మరింత సమాచారం కావాలంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
News December 25, 2025
స్క్రబ్ టైఫస్.. 20కి చేరిన మృతుల సంఖ్య

APలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్నాయి. తాజాగా బాపట్ల(D) పెదపులుగువారిపాలెంలో నాగబాబు(21) అనే యువకుడు ఈ వ్యాధితో మరణించాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడిని గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లగా పరీక్షల్లో స్క్రబ్ టైఫస్గా తేలింది. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 20కి చేరింది. కాగా ఈ పురుగు రాత్రి వేళల్లో <<18463813>>మనుషులను<<>> కుడుతుంది.


