News October 21, 2024

KCR ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు: కోదండరాం

image

TG: రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిందని, KCR ఒక్కడి వల్లే రాలేదని MLC కోదండరాం అన్నారు. నిజామాబాద్ TNGOs భవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ కోసం ఎన్నో సంఘాలు ఉద్యమించాయి. ఎందరో బలిదానాలు చేయడంతో రాష్ట్రం సిద్ధించింది. KCR తన స్వలాభం కోసం ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారు. పదేళ్ల పాలనలో నిరుద్యోగ సమస్యలను BRS తీర్చలేదు’ అని ఆయన విమర్శించారు.

Similar News

News March 15, 2025

తగ్గిన బంగారం ధరలు

image

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాదులో 24K గోల్డ్ 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.89,670 వద్ద కొనసాగుతోంది. ఇక 22K 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.82,200 వద్దకు చేరుకుంది. వెండి కిలో రూ.1,12,000 వద్ద యథాతథంగా ట్రేడవుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.27,780 వద్ద ఉంది.

News March 15, 2025

రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

image

TG: అసెంబ్లీలో రైతు రుణమాఫీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సగం మందికి కూడా మాఫీ జరగలేదన్నారు. దీంతో రైతుల వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ జిల్లాల వారీగా ఎన్నికోట్ల మాఫీ జరిగిందో భట్టి చదివి వినిపించారు.

News March 15, 2025

అప్పటివరకు రోహిత్ శర్మనే కెప్టెన్?

image

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ వరకు భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతారని తెలుస్తోంది. ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఉంటుందని బీసీసీఐ వర్గాల సమాచారం. దీనిపై బీసీసీఐ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని టాక్. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన BGTలో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియా 1-3 తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్లు వినిపించాయి.

error: Content is protected !!