News January 1, 2025

తెలంగాణ రైతులకు సర్కారు తీపి కబురు

image

TG: రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయిల్ పామ్ గెలల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్ను పామాయిల్ గెలల ధరను రూ.20,506గా నిర్ణయించినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నేటి నుంచే పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపారు. ఏడాది పాలనలో తమ ప్రభుత్వం రూ.21వేల కోట్ల రుణమాఫీ, రూ.7625 వేల కోట్ల రైతుబంధు, రూ.3వేల కోట్ల రైతు బీమా ఇచ్చినట్లు గుర్తుచేశారు.

Similar News

News October 29, 2025

మధ్యాహ్నానికి సాధారణ స్థితి: CM చంద్రబాబు

image

AP: మొంథా తుఫాన్ తీరం దాటిందని, ఇవాళ మధ్యాహ్నానికి సాధారణ స్థితి నెలకొంటుందని CM చంద్రబాబు తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మరణించినట్లు చెప్పారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు 10వేల మందిని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది బాగా పనిచేశారని అభినందించారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగిందని టెలీకాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు.

News October 29, 2025

పిల్లలకు ఈ టీకాలు వేయిస్తున్నారా?

image

భారత ప్రభుత్వం సార్వత్రిక టీకా కార్యక్రమం కింద క్షయ (BCG), పోలియో, ధనుర్వాతం (టెటనస్), హెపటైటిస్-బి, డిప్తీరియా, కోరింత దగ్గు, మెదడువాపు (హిబ్), న్యుమోకోక్కల్ వంటి 10కి పైగా టీకాలను ఉచితంగా అందిస్తోంది. ఈ టీకాల ద్వారా పిల్లల మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇవి లేకపోతే భారతీయ సగటు ఆయుర్దాయం 30-40 ఏళ్లకే పరిమితమయ్యేదట. అందుకే ప్రతి బిడ్డకు టీకాలు వేయించడం తప్పనిసరి. SHARE IT

News October 29, 2025

పుట్టుకతో గుండె లోపాలుంటే పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు

image

గుండెలోపాలతో పుట్టే శిశువులకు, వారి తల్లులకు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రచురించిన ఈ అధ్యయనంలో గుండెలోపాలున్న శిశువుల్లో 66% ఎక్కువ క్యాన్సర్లు బయటపడ్డాయి. ముఖ్యంగా రక్తనాళాలు, గుండెకవాటాల లోపం ఉంటే ముప్పు రెండింతలు ఎక్కువగా ఉంది. తల్లి జన్యు స్వభావం వల్ల తల్లీబిడ్డలిద్దరీ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.