News January 1, 2025
తెలంగాణ రైతులకు సర్కారు తీపి కబురు

TG: రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయిల్ పామ్ గెలల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్ను పామాయిల్ గెలల ధరను రూ.20,506గా నిర్ణయించినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నేటి నుంచే పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపారు. ఏడాది పాలనలో తమ ప్రభుత్వం రూ.21వేల కోట్ల రుణమాఫీ, రూ.7625 వేల కోట్ల రైతుబంధు, రూ.3వేల కోట్ల రైతు బీమా ఇచ్చినట్లు గుర్తుచేశారు.
Similar News
News December 4, 2025
బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు సూచనలు

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీచేయాలి. తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. ఏటా తొలకరిలో ఎండుపుల్లలను కత్తిరించి దూరంగా పారేయాలి. శిలీంధ్రాలకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కల కట్టడికి మల్చింగ్ విధానం అనుసరించాలి. కలుపు మందులు, రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ, తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
News December 4, 2025
పుతిన్ భారత పర్యటన షెడ్యూల్

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సాయంత్రం 6.35 గం.కు ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు 11AMకు రాష్ట్రపతి భవన్లో స్వాగత కార్యక్రమం ఉంటుంది. 11.30AMకు మహాత్మాగాంధీ సమాధి (రాజ్ఘాట్) వద్ద నివాళి అర్పిస్తారు. 11.50AMకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తారు. 1.50PMకు మీడియా సమావేశం ఉంటుంది. 3.40PMకు బిజినెస్ ఈవెంట్, 7PMకు రాష్ట్రపతి ముర్ముతో సమావేశంలో పాల్గొంటారు.
News December 4, 2025
తొక్కిసలాటకు ఏడాది.. దయనీయస్థితిలో శ్రీతేజ్

గతేడాది Dec 4 రాత్రి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన <<14796361>>తొక్కిసలాటలో<<>> గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఏడాదైనా దయనీయంగానే ఉంది. తానంతట తాను అన్నం తినలేని స్థితిలో ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంటున్నాడు. ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నాడు. అతడికి చికిత్స ఇప్పించేందుకు నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతున్నాయని, అల్లు అర్జున్ మేనేజర్ను సంప్రదిస్తే సానుకూల స్పందన లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు.


