News March 23, 2025
BRS హయాంలో తెలంగాణ అప్పులపాలు: బండి సంజయ్

TG: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దీనికి కేసీఆర్ మూర్ఖత్వమే కారణమని ఆయన విమర్శించారు. ‘ప్రస్తుతం రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. హామీలు ఇచ్చినప్పుడు అప్పులు ఉన్నట్లు తెలియదా? అధికారంలోకి వచ్చాక ఏం చేద్దామనుకున్నారు? అప్పులు తీర్చేందుకు ప్రభుత్వం భూములు అమ్మే పరిస్థితికి దిగజారింది’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News December 10, 2025
సుందర్ పిచాయ్తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 10, 2025
దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.


