News July 9, 2025

ఏపీ సీఎంకు తెలంగాణ MLA విజ్ఞప్తి

image

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబును అచ్చంపేట MLA వంశీకృష్ణ కోరారు. నిన్న శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేందుకు వచ్చిన CMను డ్యాంపైన కలిసి మద్దిమడుగు సమీపంలో వంతెన నిర్మాణ ఆవశ్యకతపై MLA వినతిపత్రం ఇచ్చారు. మద్దిమడుగు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి AP నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తారని, వంతెన నిర్మాణం పూర్తైతే 100KM దూరం తగ్గుతుందని వివరించారు.

Similar News

News July 9, 2025

‘శబరి’ రైలు ఇక సూపర్‌‌ఫాస్ట్

image

సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ రైలు మ.2.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతి రోజు సా.6.20కు తిరువనంతపురం చేరనుంది. అలాగే అక్కడ ఉ.6.45కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.11 గంటలకే సికింద్రాబాద్ రానుంది. ఈ కొత్త షెడ్యూల్ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై త్వరలోనే అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు.

News July 9, 2025

గోల్డెన్ వీసాపై రూమర్లు నమ్మొద్దు: UAE

image

తాము ప్రవేశపెట్టబోయే <<16986034>>గోల్డెన్ వీసాపై<<>> వస్తున్న రూమర్లను ఎవరూ నమ్మొద్దని UAE తెలిపింది. దీనిపై ఎలాంటి థర్డ్ పార్టీ సంస్థకు హక్కులు ఇవ్వలేదని, తమ దేశ అధికారిక సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మధ్యవర్తులను సంప్రదించవద్దని కోరింది. ఈ విషయంలో ఎవరైనా మోసానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరిన్ని వివరాలకు 600522222ను సంప్రదించాలని సూచించింది.

News July 9, 2025

ఇవాళ భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

image

TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి లిస్ట్ కోసం <>క్లిక్<<>> చేయండి.