News September 20, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ నేడు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆఫీసర్లతో సీఎం రేవంత్ భేటీ. అభివృద్ధి పనుల తీరు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం
☛ ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను లంచం అడిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. టోల్ ఫ్రీ నంబర్ 18005995991కి ఫిర్యాదు చేయవచ్చు: మంత్రి పొంగులేటి
☛ అక్టోబర్ నుంచి పత్తి కొనుగోళ్లు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
☛ నేటి నుంచి PGECET తుది విడత కౌన్సెలింగ్
Similar News
News September 20, 2025
కృష్ణా జలాలపై కొత్త పంచాయితీ!

కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 నుంచి 524 అడుగులకు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల TGకి నష్టం జరుగుతుందని, CM రేవంత్ ఎందుకు నోరు విప్పడం లేదని KTR ప్రశ్నించారు. అటు AP అసెంబ్లీలో MLA సోమిరెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. 130 TMCల కృష్ణా జలాలను మళ్లించేందుకు KA 1.33L ఎకరాల భూసేకరణ చేసి, ₹70,000Cr ఖర్చు చేయాలనుకుంటోందని పేర్కొన్నారు.
News September 20, 2025
అందంగా ఉందని ఉద్యోగం ఇవ్వట్లేదు!

నైపుణ్యం, అర్హతలున్నా 50 ఇంటర్వ్యూల్లో విఫలమైనట్లు బ్రెజిల్కు చెందిన 21 ఏళ్ల యువతి అలే గౌచా చేసిన పోస్ట్ వైరలవుతోంది. తాను nanny(కేర్ టేకర్) పోస్ట్కి అప్లై చేశానని ఆమె పేర్కొంది. అందంతో పాటు ఆకర్షణీయంగా ఉండటంతో ఎవరూ నియమించుకోవట్లేదని వాపోయింది. వివాహేతర సంబంధాలు తలెత్తుతాయని ఇంట్లోని మహిళలు భయపడుతున్నారని ఆమె చెబుతోంది. ఉద్యోగం రాకపోవడంతో కంటెంట్ క్రియేటర్గా(అడల్ట్) మారినట్లు ఆమె పేర్కొంది.
News September 20, 2025
బొప్పాయిలో మొజాయిక్ వైరస్ లక్షణాలు

బొప్పాయి తోటల్లో మొజాయిక్ వైరస్ విత్తనం, పేను ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులపై అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ పూర్తిగా ఆకు పసుపు రంగుకు మారుతుంది. అందుకే దీనిని పల్లాకు తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన ఆకులు ముడుచుకుపోయి పెళుసుగా మారతాయి. మొక్కలు సరిగా ఎదగవు. బలహీనంగా కనిపిస్తాయి. కాయల్లో నాణ్యత ఉండదు. పండ్లు చిన్నవిగా, వికృతంగా తయారవుతాయి.