News October 9, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* ఆర్టీసీ సిటీ బస్ ఛార్జీల పెంపుకు నిరసనగా నేడు ‘చలో బస్‌భవన్’కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ఆందోళనలో పాల్గొననున్న KTR, హరీశ్ రావు
* బీఆర్ఎస్ నిరసనకు పిలుపునివ్వడం హాస్యాస్పదం: మంత్రి పొన్నం
* నేటి నుంచి HYDలోని రవీంద్రభారతిలో ఆర్టీఐ 20వ వారోత్సవాలు.. చీఫ్ గెస్ట్‌గా జిష్ణుదేవ్ వర్మ
* సింగరేణిలో సమ్మెలపై 2026 మార్చి 11 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు

Similar News

News October 9, 2025

6 రోజుల్లోనే రూ.5,620 పెరిగిన గోల్డ్ రేట్

image

బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 పెరిగి రూ.1,24,150కు చేరింది. 6 రోజుల్లోనే రూ.5,620 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,13,800 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,71,000కి చేరుకుంది. 6 రోజుల్లోనే రూ.9వేలు పెరగడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 9, 2025

లక్ష్మీదేవి పద్మం పైనే ఎందుకుంటుంది?

image

లక్ష్మీదేవిని పద్మంపై ఆసీనురాలిగా చూపడం వెనుక ఆధ్యాత్మిక సందేశం ఉంది. తామరపువ్వు నీటిలో అటూ ఇటూ కదులుతూ, ఊగుతూ ఉంటుంది. ఆ తామర మాదిరిగానే సంపద కూడా చంచలమైనది. అంటే నిలకడ లేనిదని అర్థం. లక్ష్మీదేవి కమలంపై కొలువై ధనం అశాశ్వత స్వభావాన్ని మానవులకు నిరంతరం గుర్తుచేస్తుంది. సంపద శాశ్వతం కాదని, మనిషి గర్వం లేకుండా ఉండాలని ఈ దైవిక రూపం మనకు బోధిస్తుంది. <<-se>>#DHARMASANDEHALU<<>>

News October 9, 2025

20 మంది చిన్నారుల మృతి.. ‘శ్రేసన్’ ఓనర్ అరెస్ట్

image

దగ్గు <<17954495>>మందు<<>> అంటేనే భయపడేలా కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తయారు చేసిన శ్రేసన్ కంపెనీ(తమిళనాడు) ఓనర్‌ రంగనాథన్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల మరణాలతో ఈ నెల 1, 2 తేదీల్లో అధికారులు చేసిన తనిఖీల్లో గ్యాస్ స్టవ్‌లపై రసాయనాలు వేడి చేయడం, తుప్పు పట్టిన పరికరాలు గుర్తించారు. అనుభవం లేని సిబ్బంది, గ్లౌజులు, మాస్కులు లేకుండా పనిచేస్తున్నట్లు గమనించారు. అనంతరం కంపెనీని సీజ్ చేశారు.