News October 9, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* ఆర్టీసీ సిటీ బస్ ఛార్జీల పెంపుకు నిరసనగా నేడు ‘చలో బస్‌భవన్’కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ఆందోళనలో పాల్గొననున్న KTR, హరీశ్ రావు
* బీఆర్ఎస్ నిరసనకు పిలుపునివ్వడం హాస్యాస్పదం: మంత్రి పొన్నం
* నేటి నుంచి HYDలోని రవీంద్రభారతిలో ఆర్టీఐ 20వ వారోత్సవాలు.. చీఫ్ గెస్ట్‌గా జిష్ణుదేవ్ వర్మ
* సింగరేణిలో సమ్మెలపై 2026 మార్చి 11 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు

Similar News

News February 14, 2026

కొత్తగూడెంపై కమ్యూనిస్ట్ జెండా.. CPIకి కాంగ్రెస్ మద్దతు!

image

TG: హంగ్ ఏర్పడ్డ కొత్తగూడెం కార్పొరేషన్‌‌పై అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీపీఐకి మద్దతు తెలుపుతూ మేయర్ పీఠం ఆఫర్ చేసినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇవ్వాలని కమ్యూనిస్ట్ నేతలతో సీఎం రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్‌పై కమ్యూనిస్ట్ జెండా ఎగరనుంది. అటు ఇప్పటికే తామూ CPIకి మద్దతు ఇస్తామని BRS ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.

News February 14, 2026

18 బంతుల్లోనే 50 రన్స్..

image

T20WCలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా(3 ఓవర్లు) 50 పరుగులు చేసిన రెండో టీమ్‌గా నిలిచింది. మార్క్రమ్ 14 బంతుల్లో 41, డికాక్ 4 బంతుల్లో 9 రన్స్ కొట్టారు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 2016లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ 2.5 ఓవర్లలోనే 50 బాదింది. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో SA పవర్ ప్లే ముగిసే సమయానికి 83/1 స్కోర్ చేసింది.

News February 14, 2026

40 కంపెనీల సీఈవోలు, 20 దేశాల లీడర్లతో మోదీ భేటీ

image

ఢిల్లీలో ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహించనున్న AI Impact Summit కోసం కేంద్రం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాని మోదీ 35-40 టాప్ కంపెనీల సీఈవోలు, 20 దేశాల లీడర్లతో భేటీ కానున్నారు. లిస్టులో ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, ఆంథ్రోపిక్, నెట్‌ఫ్లిక్స్, జూమ్, అమెజాన్ తదితర సంస్థలున్నాయి. దాదాపు $100 బిలియన్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. పీపుల్-ప్లానెట్-ప్రోగ్రెస్ అంశాలపై ఈ సమ్మిట్ జరగనుంది.