News March 18, 2024

బీజేపీకి అధికారమిస్తే తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తాం: మోదీ

image

BJPకి అధికారమిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని PM మోదీ అన్నారు. ‘రైతుల కోసం పసుపు బోర్డు తీసుకొచ్చాం. పంట ధరను క్వింటాల్‌కు ₹6వేల నుంచి ₹30వేలకు పెంచాం. ఇక్కడి ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయి. మేము ₹6,400కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాం. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రగతిపై దృష్టి సారిస్తాం’ అని తెలిపారు.

Similar News

News July 1, 2024

హోంమంత్రి ఇలాకాలో కీచకపర్వం: YCP

image

AP: హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో కీచకపర్వం అంటూ ఇద్దరు మహిళలపై కొందరు దాడికి పాల్పడిన వీడియోను YCP పోస్ట్ చేసింది. నడిరోడ్డుపై మహిళల దుస్తులు చించి, వారిపై అమానుషంగా దాడి చేసినట్లు పేర్కొంది. ఇదేనా ఆడబిడ్డలకి మీరు కల్పిస్తానన్న రక్షణ అంటూ హోంమంత్రిని YCP ప్రశ్నించింది.

News July 1, 2024

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులు పెంపు

image

రాష్ట్రాలు, UTలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్(WMA) పరిమితులను RBI పెంచింది. గతంలో వాటి లిమిట్ ₹47,010 కోట్లు ఉండగా, ఇవాళ్టి నుంచి ఆ మొత్తాన్ని ₹60,118 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ ప్రభుత్వ పరిమితి ₹2,252 కోట్ల నుంచి ₹2,921 కోట్లకు పెరిగింది. అత్యవసర ఖర్చులకు నిధుల లభ్యత లేనప్పుడు తాత్కాలిక రుణ సౌకర్యం కల్పించడాన్ని WMA అంటారు. 3 నెలలలోపు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

News July 1, 2024

మిషన్ పూర్తైంది: బీసీసీఐ

image

వరల్డ్ కప్ సాధించాలనే మిషన్ పూర్తయినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘బిలియన్ల మంది అభిమానుల భావోద్వేగాలు, చిరునవ్వులు, కలలతో కూడుకున్న T20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నాం. ప్రపంచ విజేతలుగా నిలిచాం. కెప్టెన్.. మీరు సాధించారు’ అంటూ టీ20 WC ట్రోఫీతో రోహిత్ దిగిన ఫొటోలను పంచుకుంది.