News July 24, 2024

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఎడారి అవుతుంది: మహేశ్వర్ రెడ్డి

image

APకి కేంద్రం రూ.15వేలకోట్లు కాకుండా ప్రత్యేక హోదా ఇచ్చుంటే తెలంగాణ ఎడారిగా మారేదని BJP MLA మహేశ్వర రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘APకి డబ్బులు ఇచ్చారనే అక్కసు ఎందుకు? వారికి హోదా ఇచ్చుంటే తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోయేవి. APకి హోదా ఇవ్వకుండా TGని రక్షించిన మోదీకి పాలాభిషేకం చేయాలి’ అని ఆయన సభలో మాట్లాడారు. అటు కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చను నిరసిస్తూ BJP సభ్యులు వాకౌట్ చేశారు.

Similar News

News December 6, 2025

శభాష్.. తల్లికి పునర్జన్మనిచ్చాడు

image

AP: విద్యుత్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లి ప్రాణాలను సమయస్ఫూర్తితో కాపాడుకున్నాడో ఐదో తరగతి బాలుడు. ఈ ఘటన ప.గో(D) జొన్నలగరువులో జరిగింది. నిన్న మెగా PTMకు వస్తానన్న తల్లి ఎంతకీ రాకపోవడంతో కొడుకు దీక్షిత్ ఇంటికి వెళ్లగా ఆమె కరెంట్ షాక్‌తో విలవిల్లాడుతూ కనిపించింది. కొడుకు భయపడకుండా స్విచ్ ఆఫ్ చేసి, కరెంటు తీగను తీసేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో పిల్లాడి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

News December 6, 2025

రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల

image

రూపాయి పతనంపై కేంద్ర మంత్రి నిర్మల స్పందించారు. రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుందని అన్నారు. ఈ పతనం ప్రతికూలం కాదని, ఎగుమతిదారులకు ప్రయోజనకరమని చెప్పారు. ‘రూపాయి, కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్ల వంటివి చాలా సెన్సిటివ్ అంశాలు. మేం ప్రతిపక్షంలో ఉండగా నిరసనలు చేశాం. కానీ అప్పట్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎకానమీ ఏ పొజిషన్‌లో ఉందో చూడండి’ అని HT సమ్మిట్‌లో అన్నారు.

News December 6, 2025

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు(1/2)

image

వైరస్ ఆశించిన కూరగాయల మొక్కల్లో లేత ఆకులు చిన్నగా, పసుపు రంగుకు మారి పాలిపోయినట్లు కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై అక్కడక్కడ పసుపురంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులపై పసుపు చారలు ఏర్పడి, గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్యభాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకుల ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారతాయి. మొక్క చివరి ఆకులు ఎండి, చనిపోయినట్లుగా ఉంటాయి.