News July 24, 2024

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఎడారి అవుతుంది: మహేశ్వర్ రెడ్డి

image

APకి కేంద్రం రూ.15వేలకోట్లు కాకుండా ప్రత్యేక హోదా ఇచ్చుంటే తెలంగాణ ఎడారిగా మారేదని BJP MLA మహేశ్వర రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘APకి డబ్బులు ఇచ్చారనే అక్కసు ఎందుకు? వారికి హోదా ఇచ్చుంటే తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోయేవి. APకి హోదా ఇవ్వకుండా TGని రక్షించిన మోదీకి పాలాభిషేకం చేయాలి’ అని ఆయన సభలో మాట్లాడారు. అటు కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చను నిరసిస్తూ BJP సభ్యులు వాకౌట్ చేశారు.

Similar News

News December 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 94 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: పైన చిత్రంలో ఉన్న మహాభారత పాత్ర ఎవరిది? ఆయనను ఎవరు చంపారు?
సమాధానం: పైన చిత్రంలో ఉన్నది గాంధారికి సోదరుడు, దుర్యోధనుడికి మేనమామ అయిన ‘శకుని’. మహాభారతంలో ఈయన కౌరవుల పక్షాన ఉంటాడు. పాండవులపై కుట్రలు పన్నుతాడు. పాచికల ఆటలో మోసం చేసి, పాండవుల రాజ్య నాశనానికి, ద్రౌపది అవమానానికి కారణమవుతాడు. దీనికి ప్రతీకారంగా కురుక్షేత్రంలో సహదేవుడు శకునిని సంహరిస్తాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 12, 2025

భారత్ ఘన విజయం

image

U-19 ఆసియా కప్‌లో UAEపై టీమ్‌ ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 433 పరుగులు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. వైభవ్‌ సూర్యవంశీ 171 పరుగులతో సంచలన ఇన్నింగ్స్‌ ఆడారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో UAE 14 ఓవర్లకే వికెట్లు కోల్పోయింది. అనంతరం ఉద్దిశ్‌ సూరీ(78), పృథ్వీ మధు(50) పోరాడినా ఆ టీమ్ 199/7 రన్స్‌కే పరిమితమైంది.

News December 12, 2025

ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ పెద్దలతో భేటీకానున్నారు. 18న సాయంత్రం విజయవాడ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నారు. అదేరోజు రాత్రి పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఆమోదాలు, అనుమతులపై చర్చించే అవకాశం ఉంది. 19న సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరనున్నారు.