News December 1, 2024
ఏపీలో జడ్జిగా తెలంగాణ యువతి

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన గాయత్రి ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూలపల్లి మండలం వడ్కాపూర్కు చెందిన మొగురం మొండయ్య-లక్ష్మి దంపతుల కుమార్తె గాయత్రి వరంగల్లోని కాకతీయ వర్సిటీలో లా చదివారు. అనంతరం పీజీ లా కామన్ ఎంట్రన్స్లో నాలుగో ర్యాంక్ సాధించి ఉస్మానియాలో ఎల్ఎల్ఎం అభ్యసించారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షల ఫలితాల్లో ఆమె ఎంపికయ్యారు.
Similar News
News April 1, 2026
అశ్వారావుపేట: ఆయిల్పామ్ గెల టన్ను @23,005

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ పామాయిల్ (CPO) ధరలు పెరగడంతో ఆయిల్పామ్ రైతులకు భారీ లబ్ధి చేకూరనుంది. మార్చి నెలకు గాను టన్ను గెలల ధరపై రూ.1,459 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టన్ను ధర రూ.23,005.33కు చేరింది. ప్రభుత్వ కొత్త ధరల సూత్రం రైతులకు ఆశాజనకంగా మారడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే మెరుగైన ధర లభించడంతో సాగుపై రైతులు మరింత ఉత్సాహం చూపుతున్నారు.
News April 1, 2026
అశ్వారావుపేట: ఆయిల్పామ్ గెల టన్ను @23,005

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ పామాయిల్ (CPO) ధరలు పెరగడంతో ఆయిల్పామ్ రైతులకు భారీ లబ్ధి చేకూరనుంది. మార్చి నెలకు గాను టన్ను గెలల ధరపై రూ.1,459 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టన్ను ధర రూ.23,005.33కు చేరింది. ప్రభుత్వ కొత్త ధరల సూత్రం రైతులకు ఆశాజనకంగా మారడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే మెరుగైన ధర లభించడంతో సాగుపై రైతులు మరింత ఉత్సాహం చూపుతున్నారు.
News April 1, 2026
హార్ముజ్ ఓపెన్ చేస్తేనే సీజ్ఫైర్పై చర్చలు: ట్రంప్

సీజ్ఫైర్ చేసుకోవాలని ఇరాన్ తమను అడిగిందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. అయితే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తేనే సీజ్ఫైర్పై ఆలోచిస్తామని చెప్పానని పేర్కొన్నారు. అప్పటివరకు తాము ఇరాన్పై దాడులు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తొందరగా లొంగిపోకుంటే ఇరాన్కు రాతియుగం గతి పడుతుందని హెచ్చరించారు.


