News December 1, 2024
ఏపీలో జడ్జిగా తెలంగాణ యువతి

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన గాయత్రి ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూలపల్లి మండలం వడ్కాపూర్కు చెందిన మొగురం మొండయ్య-లక్ష్మి దంపతుల కుమార్తె గాయత్రి వరంగల్లోని కాకతీయ వర్సిటీలో లా చదివారు. అనంతరం పీజీ లా కామన్ ఎంట్రన్స్లో నాలుగో ర్యాంక్ సాధించి ఉస్మానియాలో ఎల్ఎల్ఎం అభ్యసించారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షల ఫలితాల్లో ఆమె ఎంపికయ్యారు.
Similar News
News December 2, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* పిజ్జా చల్లబడి, గట్టిపడితే ఒక గిన్నెలో పిజ్జా ముక్కలు పెట్టి.. మరో గిన్నెలో వేడి నీళ్లు పోసి, అందులో పిజ్జాముక్కల గిన్నెను 5 నిమిషాలు ఉంచితే చాలు.
* ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్లు మండుతుంటే ఒక టిష్యూ పేపర్ను తడిపి, దానిపై ఉల్లిగడ్డను కట్ చేస్తే కళ్లు మండవు.
* గిన్నెలు మాడిపోయినప్పుడు ఓ గ్లాస్ పెప్సీని మాడిపోయిన గిన్నెలో పోసి వేడి చేసి, 10 నిమిషాల తర్వాత కడిగితే గిన్నెలు మెరిసిపోతాయి.
News December 2, 2025
సమంత రెండో పెళ్లి.. మేకప్ స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్

సమంత-రాజ్ <<18438537>>పెళ్లి<<>> నేపథ్యంలో సామ్కు పర్సనల్ మేకప్ స్టైలిస్ట్గా పనిచేసిన సాధనా సింగ్ చేసిన ఇన్స్టా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘విక్టిమ్గా విలన్ బాగా నటించారు’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆమె సమంతనే విలన్గా పేర్కొన్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో వీరు క్లోజ్గా ఉండేవారని, ఇప్పుడు ఏమైందని చర్చించుకుంటున్నారు. నిన్న నటి పూనమ్ కౌర్ చేసిన <<18440323>>ట్వీట్<<>> సైతం వైరల్గా మారిన సంగతి తెలిసిందే.
News December 2, 2025
Karnataka: సిద్ద-శివ నాటు చికెన్ ‘బ్రేక్ఫాస్ట్’

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మరోసారి భేటీ అయ్యారు. ఇవాళ బెంగళూరులో శివకుమార్ ఇంట్లో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఇడ్లీ, దోశ, ఉప్మా, నాటు చికెన్ అల్పాహారంగా తీసుకున్నారు. సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు CMకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినట్లు శివకుమార్ ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా CM అంశంపై ఇరు వర్గాల మధ్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.


