News August 3, 2024
టెలికం సర్వీస్ ఔటేజ్: కస్టమర్లకు పరిహారం ఇవ్వాల్సిందే

టెలికం, బ్రాడ్బ్యాండ్ నాణ్యతా ప్రమాణాలను ట్రాయ్ సవరించింది. సేవలు నిలిస్తే కస్టమర్లకు పరిహారం ఇవ్వాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. ఏ ఒక్క క్వాలిటీ ప్రమాణం అందుకోకున్నా వేసే ఫైన్ను ₹50K-₹1Lకు పెంచింది.
* 2G/3G/4G/5G మొబైల్ కవరేజీ మ్యాపుల్ని వెబ్సైట్లో చూపాలి
* నెట్వర్క్ ఆగితే ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ను బట్టి వ్యాలిడిటీ, రిబేట్ ఇవ్వాలి
* ఏడాదిలో 12Hrs ఔటేజ్ను ఒక రోజుగా పరిగణిస్తారు.
Similar News
News March 19, 2026
యుద్ధం ఎఫెక్ట్.. క్రికెట్ బంతుల కొరతపై ఆందోళన!

ప.ఆసియా ఉద్రిక్తతలతో UKలో డ్యూక్ క్రికెట్ బంతుల కొరత ఏర్పడింది. APR 3 నుంచి కౌంటీ సీజన్ ప్రారంభం కానుండగా బంతుల కొరతపై ఆందోళన మొదలైంది. బాల్స్ తయారయ్యే ద.ఆసియా నుంచి రవాణా జరగాల్సి ఉండగా మిడిల్ ఈస్ట్ రూట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ రూట్లను చూస్తున్నట్లు బ్రిటిష్ క్రికెట్ బాల్స్ కంపెనీ ఓనర్ దిలీప్ జజోడియా తెలిపారు. విమానాల్లో తీసుకెళ్లాలంటే ఖర్చు 3 రెట్లు అధికం అవుతుందన్నారు.
News March 19, 2026
పార్టీల పంచాంగం.. అందరికీ శుభయోగమే!

TG: కాంగ్రెస్, BRS, BJP కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణంలో పండితులు భవిష్యత్ అంతా తమకే అనుకూలంగా ఉందని ప్రధాన పార్టీలకు వివరించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రేవంత్ పాలనకు ఇబ్బంది లేదని గాంధీభవన్లో తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగి విపక్షానికి బలం పెరుగుతుందని BRS ఆఫీస్లో చెప్పగా.. ఈ ఏడాదీ కలిసివచ్చి దేశం, రాష్ట్రంలో BJP హవా ఉంటుందన్నారు. కవితకు ప్రజల మద్దతు పెరుగుతుందని చెప్పారు.
News March 19, 2026
అదృష్టంగా మారిన దురదృష్టం.. పదేళ్లుగా ఫ్రీగా గ్యాస్!

కేరళం ఆలప్పుళకు చెందిన రెత్నమ్మ 2011లో నీటి కోసం బోరు తవ్వించారు. కానీ నీరు పడలేదు. బోరు పైపును క్లోజ్ చేసే సమయంలో ఓ వ్యక్తి అగ్గిపుల్ల వెలిగించగా పైపు నుంచి మంటలు వచ్చాయి. దీనిని గ్యాస్లా వాడుకోవచ్చని రెత్నమ్మ ఆ పైపును కిచెన్కు కనెక్ట్ చేసుకున్నారు. పదేళ్లు పైగా దానిని వాడుతూ ఏడాదికి రూ.10వేలు సేవ్ చేస్తున్నారు. బోరు నుంచి వచ్చేది మీథేన్ అని, కానీ అక్కడ భూగర్భ నిల్వలు లేవని అధికారులు తేల్చారు.


