News April 1, 2024
ఫేక్ న్యూస్కు చెప్పండి చెక్
యూజర్లకు ముఖ్య గమనిక. మన Way2News లోగోతో కొందరు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మా లోగోతో వచ్చే ఫార్వర్డ్స్ వెరిఫై చేశాక మాత్రమే ఇతరులకు షేర్ చేయండి. మా ప్రతి ఆర్టికల్కు యునిక్ కోడ్ ఉంటుంది. మీరు పొందిన స్క్రీన్షాట్పై కోడ్ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. సెర్చ్లో మరో వార్త వచ్చినా, ఏది రాకపోయినా మీరు పొందినది ఫేక్ వార్త. వీటిని grievance@way2news.comకు మెయిల్ చేయండి.
Similar News
News October 6, 2024
రేపు వారి అకౌంట్లలో డబ్బులు జమ
AP: సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద బాధితులకు ప్రభుత్వం రేపు డబ్బులు అందించనుంది. మొత్తం 21,768 మంది ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ సాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం గత నెలలో రూ.602 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఆధార్ లింక్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమకాలేదు.
News October 6, 2024
ఘోరం.. 1.7లక్షల మందికి ఒక్క టాయిలెట్!
బెంగళూరు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. కానీ, అక్కడున్న 1.4 కోట్ల మంది ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన టాయిలెట్లను ఏర్పాటు చేయలేకపోయింది. నగరంలో 803 పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు RV యూనివర్సిటీ నివేదికలో వెల్లడైంది. ఈ లెక్కన ప్రతి 1.7లక్షల మందికి ఓ టాయిలెట్ ఉందన్న మాట. వీటిలోనూ సగం వాటిల్లో లైట్స్ లేవని తేలింది. కాగా HYDలోనూ టాయిలెట్స్ పెంచాలని నెటిజన్లు కోరుతున్నారు.
News October 6, 2024
కాంగ్రెస్ మోసాలపై నిలదీయండి.. యువతకు హరీశ్రావు పిలుపు
TG: గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసిన యువత ఓసారి ఆలోచించాలని హరీశ్రావు కోరారు. ‘పింఛన్ పెంచలేదు. పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసాకు దిక్కులేదు. బోనస్ను బోగస్ చేశారు. ఉద్యోగాల ఊసులేదు. రూ.4వేల భృతికి నీళ్లు వదిలారు. ఈ దసరాకు సొంతూళ్లకు వస్తున్న వారితో INC మోసాలపై చర్చించండి. ఆ పార్టీ నాయకులను నిలదీయండి’ అని Xలో పిలుపునిచ్చారు.