News April 28, 2024

ఆర్చరీలో అదరగొట్టిన తెలుగమ్మాయి

image

ఆర్చరీ ప్రపంచకప్‌లో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ అదరగొట్టారు. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత, టీమ్, మిక్స్‌డ్ విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచారు. దీంతో దీపిక కుమారి తర్వాత ఒకే ప్రపంచకప్‌లో మూడు బంగారు పతకాలు నెగ్గిన భారత రెండో ఆర్చర్‌గా జ్యోతి నిలిచారు. కాగా వ్యక్తిగత విభాగంలో ఫైనల్ విజయంతో ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌కు జ్యోతి అర్హత సాధించారు.

Similar News

News November 23, 2025

వరంగల్: టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఇన్‌ఛార్జ్ పదోన్నతులు

image

టీజీ ఎన్పీడీసీఎల్‌లో నెలలుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు ఎట్టకేలకు ఇన్‌ఛార్జ్‌గా పదోన్నతులు ఇచ్చి యాజమాన్యం ముగింపు పలికింది. కోర్టు కేసుల కారణంగా రెగ్యులర్ పదోన్నతులు జాప్యం కావడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తాయి. వాటి నివారణకు ముగ్గురు ఎస్ఈలను చీఫ్ ఇంజినీర్లుగా, ఆరుగురు డీఈలను ఎస్ఈలుగా, 21 మందిని డీఈలుగా పదోన్నతి చేశారు. అలాగే, కొన్ని పరిపాలనా హోదాలకు కూడా ఇన్‌ఛార్జ్ ప్రమోషన్లు మంజూరు చేశారు.

News November 23, 2025

వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం.. IBSA నాయకులతో మోదీ

image

జొహనెస్‌బర్గ్‌లో జరుగుతున్న G20 సమ్మిట్‌లో IBSA (ఇండియా-బ్రెజిల్-సౌతాఫ్రికా) నాయకులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా ద సిల్వాలకు IBSA డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్, IBSA ఫండ్ ఫర్ క్లైమేట్ రెసిలియెంట్ అగ్రికల్చర్ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. 40 దేశాల్లో విద్య, హెల్త్, మహిళా సాధికారతకు IBSA ఇస్తున్న మద్దతును ప్రశంసించారు.

News November 23, 2025

డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే ‘రైతన్నా.. మీకోసం’: జగన్

image

AP: రైతులను కాలర్ ఎగరేసుకునేలా చేస్తామని చెప్పి ఎండమావులు చూపిస్తారా అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. రైతుల ఒంటి మీద చొక్కా తీసేసి రోడ్డు మీద నిలబెట్టారని ఫైరయ్యారు. రైతుల కష్టాలు, బాధలపై చర్చ జరగకుండా చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్ ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం అని విమర్శించారు. 18 నెలల్లో రైతుల కోసం ఎప్పుడు నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? అని జగన్ Xలో ప్రశ్నించారు.