News September 11, 2024

ఇండియా-ఎ జట్టులోకి తెలుగు కుర్రాడు

image

ఆంధ్ర యంగ్ క్రికెటర్ షేక్ రషీద్ ఇండియా-ఎ జట్టుకు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన ధ్రువ్ జురెల్ స్థానంలో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. రేపు అనంతపురంలో ఇండియా-డితో జరగబోయే మ్యాచ్‌లో రషీద్ బరిలోకి దిగనున్నారు. కాగా రషీద్ గతంలో ఇండియా అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడుతున్నారు.

Similar News

News November 2, 2025

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు: Lok Poll సర్వే

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని Lok Poll సర్వే తెలిపింది. 3,100 మందిపై సర్వే చేయగా 44% మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. బీఆర్ఎస్‌కు 38శాతం, బీజేపీ 15శాతం, ఇతరులు 3శాతం ప్రభావం చూపుతారని వెల్లడించింది. నిన్న విడుదలైన <<18171588>>కేకే సర్వేలో<<>> బీఆర్ఎస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉపఎన్నిక ఈ నెల 11న జరగనుంది.

News November 2, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 16 ఉద్యోగాలు

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<>IOL<<>>) దులియాజాన్‌లో 16 కాంట్రాక్టువల్ డ్రిల్లింగ్/వర్క్ఓవర్ ఆపరేటర్, వర్క్‌ఓవర్ అసిస్టెంట్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా లేదా సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: https://www.oil-india.com/ను సంప్రదించండి.

News November 2, 2025

ప్రతిరోజు తప్పక పఠించాల్సిన 4 మంత్రాలు

image

☞ ‘ఓం గం గణపతయే నమః’ రోజూ ఈ మంత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగి, అంతర్గత శాంతి లభిస్తుంది.
☞ ‘ఓం నమః శివాయ’ ఈ పంచాక్షరీ మంత్రం ఏకాగ్రతను, సానుకూల శక్తిని, మానసిక బలాన్ని పెంచుతుంది.
☞ ‘ఓం హం హనుమతే నమః’ ఈ మంత్రం శారీరక బలంతో పాటు మీలో ధైర్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
☞ ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః’ ఈ మంత్ర జపం సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. మీకు బలాన్ని పెంపొందిస్తుంది