News April 14, 2024
చిరంజీవిని కలిసిన తెలుగు డైరెక్టర్లు.. ఎందుకంటే?

విశ్వంభర సినిమా సెట్లో మెగాస్టార్ చిరంజీవిని టాలీవుడ్ డైరెక్టర్లు కలిశారు. మే 4న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే సందర్భంగా HYD ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈవెంట్కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఇందుకు ఆయన సమ్మతించారు. చిరంజీవితో సమావేశమైన వారిలో అనుదీప్, మెహర్ రమేశ్, సాయి రాజేశ్, శ్రీరామ్ ఆదిత్య ఉన్నారు. కాగా వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
Similar News
News March 31, 2026
నా భర్తతో స్వేచ్ఛగా విభేదిస్తా: JD వాన్స్ సతీమణి ఉష

అన్ని విషయాల్లో తాను తన భర్తతో ఏకీభవించనని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ సతీమణి ఉష తెలిపారు. ఆయన చుట్టూ ఎంత మంది అడ్వైజర్స్ ఉన్నా.. కొన్ని విషయాల్లో వాన్స్ తననే సంప్రదిస్తారని వెల్లడించారు. అలా అని ఆయన పనిలో మాత్రం తాను జోక్యం చేసుకోనని చెప్పారు. ఏదీ దాచుకోకుండా ఒకరి అభిప్రాయాలు ఒకరితో పంచుకుంటామని, స్వేచ్ఛగా విభేదించుకుంటామని తెలిపారు. ఇది ఇద్దరి ఎదుగుదలకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
News March 31, 2026
ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్

భారత్లో అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగోకు కొత్త CEOగా విలియం వాల్ష్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం IATA(ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. గతంలో ఈయన బ్రిటిష్ ఎయిర్వేస్ తదితర సంస్థల్లో పనిచేశారు. విలియం నాయకత్వంలో ఎయిర్లైన్స్ మరింత అభివృద్ధి చెందుతుందని ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. ఇటీవల ఇండిగో CEO పదవికి పీటర్ ఎల్బర్స్ రిజైన్ చేసిన విషయం తెలిసిందే.
News March 31, 2026
పీరియడ్స్ వాయిదాకు పిల్స్ వాడుతున్నారా?

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగల్లో ఇబ్బంది పడకుండా మహిళలు పీరియడ్స్ను తాత్కాలికంగా వాయిదా వేసే మాత్రలను వాడటం పెరిగింది. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటిని తరచూ వేసుకొంటే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. నెలసరి క్రమం తప్పుతుంది. తలనొప్పి, వికారం, రొమ్ములో గడ్డలు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కొందరికి హార్ట్ అటాక్ ముప్పూ ఉంటుంది’ అని చెబుతున్నారు.
#ShareIt


