News September 25, 2024

జనాభా వృద్ధిరేటులో తెలుగు రాష్ట్రాలు వెనుకంజ: సర్వే

image

భారత జనాభా వృద్ధిరేటు (2011-24)లో తగ్గుదల కనిపించినట్లు SBI సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వృద్ధి క్షీణించింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు జనాభా వృద్ధిలో 33% వాటాను కలిగి ఉన్నాయి. SBI రీసెర్చ్ ప్రకారం వృద్ధుల జనాభా 2024లో 15 కోట్లు దాటిందని అంచనా. ఇందులో 7.7 కోట్ల మంది మహిళలు, 7.3 కోట్ల మంది పురుషులు ఉన్నారు. వృద్ధుల జనాభా 4.6 కోట్లకు పెరిగింది.

Similar News

News September 25, 2024

మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య

image

బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య <<14192326>>కేసు<<>> నిందితుడు ముక్తి రంజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతడి కోసం ఒడిశా వెళ్లి గాలిస్తుండగా కూలేపాడులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న ఫ్యాక్టరీలో టీమ్ హెడ్‌గా ఉన్న రంజన్ కొంతకాలంగా ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో చనువుగా ఉండటం నచ్చక ఆమెను కిరాతకంగా చంపినట్లు సమాచారం.

News September 25, 2024

యాంగ్రీ లుక్‌లో ఎన్టీఆర్.. ‘దేవర’ నయా పోస్టర్

image

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. మరో రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ చేతిలో ఆయుధంతో యాంగ్రీ లుక్‌లో ఉన్నారు. ‘ఆయుధం రక్తం రుచి చూసింది. తర్వాతి వంతు ప్రపంచానిదే. మరో రెండు రోజుల్లో..’ అని రాసుకొచ్చింది.

News September 25, 2024

విశాఖ ఉక్కుకు పునర్వైభవం: లోకేశ్

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖ ప్రాంత కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లోకేశ్ సమావేశమై ప్లాంట్ అంశంపై చర్చించారు. విశాఖ ఉక్కుతో ప్రతి తెలుగు వారికి అనుబంధం ఉందని చెప్పారు. ఉక్కు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కుకు పునర్వైభవం తీసుకొస్తామని వివరించారు.