News August 14, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

☛ తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం
☛ ప్రమాదకర స్థితికి TG ద్రవ్యోల్బణం: హరీశ్ రావు
☛ MP పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తాం: రఘునందన్ రావు
☛ తాడిపత్రి మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఊరట.. ఈ నెల 18న తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి
☛ ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
Similar News
News August 15, 2025
ఇండియాపై టారిఫ్స్ వల్లే పుతిన్ కలుస్తున్నారు: ట్రంప్

రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను కలవడం వెనుక భారత్పై వేసిన అదనపు టారిఫ్స్ కూడా ఓ కారణమని US అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ‘ప్రతి నిర్ణయానికి ఓ ప్రభావం ఉంటుంది. ఇండియాపై రెండోసారి విధించిన సుంకాలు వారిని రష్యా నుంచి ఆయిల్ కొనకుండా ఆపేశాయి. మీ రెండో అతిపెద్ద కస్టమర్ని కోల్పోయినప్పుడు, మొదటి అతిపెద్ద కస్టమర్ని కోల్పోబోతున్నప్పుడు బహుశా ఆ ప్రభావం ఉందని భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.
News August 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 15, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.43 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.42 గంటలకు
✒ ఇష: రాత్రి 7.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 15, 2025
ప్రజాస్వామ్యం గెలిచింది: అచ్చెన్నాయుడు

AP: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తుతో వైసీపీ దొంగ ఓట్లు, జిమ్మిక్కులు పనిచేయలేదు. ప్రజలు కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇది ప్రజా విజయం. 2024లో ప్రజలు వారిని 11 స్థానాలకే పరిమితం చేసినా.. జగన్లో ఇంకా మార్పు రాలేదు’ అని వ్యాఖ్యానించారు.