News June 24, 2024
భారత జట్టుకు ఎంపికైన తెలుగు తేజం

తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. SRH తరఫున అదరగొట్టిన ఈ ప్లేయర్ జింబాబ్వేతో జరిగే T20 సిరీస్కు ఎంపికయ్యారు. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి ప్లేయర్గా నిలిచారు. ఐపీఎల్లో SRH తరఫున 15 మ్యాచులు ఆడిన నితీశ్ 303 పరుగులు చేశారు. అజారుద్దీన్, రాయుడు, సిరాజ్, లక్ష్మణ్, భరత్, MSK తదితరులు తెలుగు రాష్ట్రాల నుంచి భారత్కు ప్రాతినిధ్యం వహించారు.
Similar News
News December 4, 2025
తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<


