News June 24, 2024

భారత జట్టుకు ఎంపికైన తెలుగు తేజం

image

తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. SRH తరఫున అదరగొట్టిన ఈ ప్లేయర్ జింబాబ్వేతో జరిగే T20 సిరీస్‌కు ఎంపికయ్యారు. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఐపీఎల్‌లో SRH తరఫున 15 మ్యాచులు ఆడిన నితీశ్ 303 పరుగులు చేశారు. అజారుద్దీన్, రాయుడు, సిరాజ్, లక్ష్మణ్, భరత్, MSK తదితరులు తెలుగు రాష్ట్రాల నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Similar News

News March 13, 2025

తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

image

త్రిభాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కాపీపై రూపీ సింబల్‌(₹)ను తొలగించింది. రూపీ సింబల్‌కు బదులు తమిళ ‘రూ’ అక్షరాన్ని పేర్కొంది.

News March 13, 2025

KKR కెప్టెన్‌గా రహానే.. కారణం ఇదే

image

కెప్టెన్సీలో అనుభవం ఉన్న కారణంగానే తమ జట్టు కెప్టెన్‌గా రహానేను నియమించామని KKR CEO వెంకీ మైసూర్ తెలిపారు. ‘కెప్టెన్సీ అంటే ఒత్తిడి ఉంటుంది. అది యంగ్ ప్లేయర్లకు భారం. పైగా ఆక్షన్ తర్వాత జరిగే సీజన్ కాబట్టి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే ప్లేయర్ల నుంచి బెస్ట్‌ను రాబట్టగలగాలి. అందుకే అనుభవమున్న రహానేను ఎంచుకున్నాం. V అయ్యర్ కూడా కెప్టెన్సీ మెటీరియల్. అతను రహానే నుంచి నేర్చుకుంటారు’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం: రేవంత్

image

TG: గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ చెప్పారు. తాను వారితో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరో తెలియకుండానే PCC అధ్యక్షుడిగా, సీఎంగా ఎంపిక చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నిర్మల గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ అంశాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.

error: Content is protected !!