News March 22, 2024
తెలుగోడి సత్తా ఏంటో చూపనున్నారు!

మరికొన్ని గంటల్లో IPL-2024 సమరం మొదలుకానుంది. అయితే, ఈ సీజన్లో తెలుగోడి సత్తా ఏంటో చూపించేందుకు ఏడుగురు ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన షేక్ రషీద్, నితీశ్ కుమార్ రెడ్డి, కోన శ్రీకర్ భరత్, మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, రిక్కీ, ఆరవెల్లి అవినాశ్ ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది.
Similar News
News April 7, 2025
తులం బంగారం రూ.56వేలు కాబోతోందా..?

రానున్న రోజుల్లో పసిడి ధర 38% మేర పతనం అవుతుందని అంచనా వేస్తున్నట్లు USA అనలిస్ట్ జాన్ మిల్స్ వెల్లడించారు. అమెరికాలో ఇప్పుడు $3080గా ఉన్న ఔన్స్ పుత్తడి $1820కు దిగి రావచ్చన్నారు. అంటే మన దగ్గర 10గ్రా. ₹56వేలకు వస్తుందన్నమాట. బంగారం సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడం, మార్కెట్ పరిస్థితులు దీనికి కారణాలుగా పేర్కొన్నారు.
NOTE: ఇది మిల్స్ అంచనా. అన్ని పరిశీలించి కొనుగోలు/అమ్మకాల నిర్ణయం తీసుకోండి.
News April 7, 2025
ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రులు: సీఎం

AP: ప్రతీ నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో గుండెజబ్బులు, డయాబెటిస్, హైపర్టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్నిచోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని వైద్యం, ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో CM వివరించారు.
News April 7, 2025
అత్యంత అందమైన అమ్మాయిలు ఎక్కడున్నారంటే?

సౌత్ కొరియాకు చెందిన మహిళలు ఎంతో బ్యూటిఫుల్గా ఉంటారని ‘ఇన్సైడర్ మంకీ’ రిపోర్టులో తేలింది. టాప్-50 దేశాల జాబితాలో ఇండియా 18వ స్థానంలో నిలిచింది. సౌత్ కొరియా తర్వాత బ్రెజిల్, అమెరికా, జపాన్, మెక్సికో, జర్మనీ, కొలంబియా, థాయ్లాండ్, ఇటలీ, వెనిజుల దేశాలు టాప్-10లో ఉన్నాయి.