News May 25, 2024
అమ్మానాన్నలకు గుడి.. నిత్య పూజలు

TG: కన్నవాళ్లకు అన్నం పెట్టని బిడ్డలను చూస్తున్న ఈరోజుల్లో తల్లిదండ్రులకు గుడికట్టి ముగ్గురు కుమారులు నిత్యం పూజలు చేస్తున్నారు. సిద్దిపేట(D) అక్కన్నపేటకు చెందిన గొట్టె కనకయ్య, కొమురవ్వ దంపతులకు సదయ్య, మహేందర్, చిరంజీవి సంతానం. 4 ఏళ్ల క్రితం తల్లి, గతేడాది తండ్రి మృతి చెందగా.. నిత్యం తమ కళ్ల ముందే ఉండేలా పొలంలో గుడి నిర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించారు. నిన్న తండ్రి ప్రథమ వర్ధంతి నిర్వహించారు.
Similar News
News January 31, 2026
SBIలో 2,273 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

SBI 2,273 CBO పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ, మెడికల్, Engg., CA అర్హతగల వారు FEB18 వరకు అప్లై చేసుకోవచ్చు. APలో 98, TGలో 80 పోస్టులు ఉన్నాయి. వయసు 21- 30 ఏళ్ల మధ్య ఉండాలి(రిజర్వేషన్ గలవారికి సడలింపు). రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750. SC/ST/PwBDలకు ఫీజులేదు. సైట్: sbi.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 31, 2026
ఎగ్జిమ్ బ్యాంక్లో 40 పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 31, 2026
ఈ సెషన్లోనే పార్లమెంట్కు అమరావతి బిల్లు?

AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి క్లియరెన్స్ లభించింది. ఇప్పుడు న్యాయశాఖ, పట్టణాభివృద్ధి వంటి 4 కేంద్ర శాఖల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదించాక బిల్లును ఈ పార్లమెంట్ సెషన్లోనే ప్రవేశ పెట్టడానికి కూటమి MPలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఆ బిల్లుపై YCP ఏ స్టాండ్ తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.


