News March 17, 2024
రేపటి నుంచి పది పరీక్షలు
AP: రాష్ట్రంలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు 6,23,092 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరితో పాటు గతేడాది ఫెయిలైన దాదాపు లక్ష మంది విద్యార్థులు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12జ30 గంటల వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,473 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Similar News
News September 29, 2024
ఆ సెంటిమెంట్ కొనసాగిస్తున్న ఎన్టీఆర్?
దేవర హిట్ కొట్టడంతో నెట్టింట తారక్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఫ్లాప్ చూసిన దర్శకుడికి వెంటనే హిట్ ఇవ్వాలంటే తారక్ తర్వాతేనని కొనియాడుతున్నారు. బాబీకి సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత జై లవకుశ, అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్కు అరవింద సమేత, హార్ట్ఎటాక్ మూవీ తర్వాత టెంపర్తో పూరీకి, నేనొక్కడినే తర్వాత సుకుమార్కు నాన్నకు ప్రేమతో, ఆచార్య తర్వాత కొరటాలకు దేవరతో హిట్స్ ఇచ్చారని గుర్తుచేసుకుంటున్నారు.
News September 29, 2024
మూసీ ధన దాహానికి లక్షల జీవితాలు బలి: KTR
TG: సీఎం రేవంత్ రెడ్డి రూ.1.50 లక్షల కోట్ల మూసీ ధన దాహానికి లక్షల జీవితాలు బలవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరాలను నిర్మించి కన్న బిడ్డలకు ఇవ్వలేకపోతున్నామని తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. భార్య కడుపుతో ఉంది కనికరించరా అని ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్నారు. తొందరపడి మీ ప్రాణాలు బలితీసుకోవద్దు. న్యాయస్థానాలు ఉన్నాయి. మేమూ ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.
News September 29, 2024
సిట్పై మాకు నమ్మకం లేదు: గుడివాడ అమర్నాథ్
AP: తిరుమల ప్రతిష్ఠను సీఎం చంద్రబాబు దెబ్బ తీశారని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ‘కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. హామీల అమలులో విఫలమై తిరుమల లడ్డూ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే సీబీఐ విచారణ కోరలేదు. దమ్ముంటే లడ్డూ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి. ఆయన ఏర్పాటు చేసిన సిట్పై మాకు నమ్మకం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.