News October 30, 2024

నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు

image

ఢిల్లీలో నూతన ఏపీ భవన్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఏపీ భవన్ పేరుతో డిజైన్లకు టెండర్లను పిలిచింది. 11.53 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి వినియోగించుకుంటున్నాయి. అయితే ఎన్నికలకు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనను ఖరారు చేసుకుని ప్రతిపాదనలు పంపగా కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది.

Similar News

News January 6, 2026

విజయ్‌కు కొత్త చిక్కులు

image

తమిళ స్టార్ హీరో విజయ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన చివరి సినిమాగా పేర్కొంటున్న ‘జన నాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కావాల్సి ఉండగా ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. దీనిపై మూవీ టీమ్ కోర్టును ఆశ్రయించగా రేపు విచారణ జరగనుంది. మరోవైపు టీవీకే పార్టీ మీటింగ్ ర్యాలీలో <<18778497>>తొక్కిసలాట<<>> ఘటన కేసు CBIకి చేరింది. దీనిపై ఈ నెల 12న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.

News January 6, 2026

ఇతిహాసాలు క్విజ్ – 119 సమాధానం

image

ప్రశ్న: రామాయణంలో ఏ 2 విష్ణు అవతారాలు పరస్పరం ఎదురుపడ్డాయి? ఆ సందర్భం ఏంటి?
జవాబు: రామాయణంలో రాముడు, పరశురాముడు ఎదురుపడతారు. సీతాకళ్యాణం ముగించుకుని అయోధ్యకు వెళ్లేటప్పుడు శివధనుస్సు విరిచిన రాముడిని ఎదుర్కునేందుకు పరశురాముడు వస్తాడు. రాముడిలోని దైవాన్ని గుర్తించి తన అవతార సమాప్తిని ప్రకటించి తపస్సుకి వెళ్లిపోతాడు. ఇది ఒకేసారి 2 విష్ణు అవతారాలు కలిసిన అరుదైన సందర్భం. <<-se>>#Ithihasaluquiz<<>>

News January 6, 2026

కంది పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కంది పంటలో 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతే కోయాలి. పంట కోతకు 3-4 రోజుల ముందు లీటర్ నీటికి ఇమామెక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రా. కలిపి పిచికారీ చేస్తే పంట నిల్వ సమయంలో పెంకు పురుగు ఆశించకుండా కాపాడవచ్చు. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి చెత్త, ఎండిన ఆకులు, మట్టి మొదలగునవి లేకుండా చేసి 3-4 రోజుల వరకు ఎండబెట్టాలి. గింజలలో 9-10 శాతం తేమ ఉండేటట్లుగా చూసుకోని నిల్వ చేయాలి.