News July 11, 2024
అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ కోసం టెండర్లు

AP: రాజధాని అమరావతిలో ముళ్ల కంపలు, పిచ్చి మొక్కల తొలగింపు (జంగిల్ క్లియరెన్స్) కోసం CRDA టెండర్లు పిలిచింది. ఇప్పటికే కొంతమేర తొలగించినా భారీగా పెరిగిన కంపలను క్లియర్ చేసేందుకు యంత్ర సామగ్రి అవసరం కావడంతో రూ.36.50 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. అర్హతలు, అతి తక్కువగా కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగిస్తారు. ఈ జంగిల్ క్లియరెన్స్ కోసం 30 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.
Similar News
News February 16, 2026
ఏటి ఈతకు లంక మేతకు సరి

ఒక పశువు నదిని (ఏరు) ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న లంక భూమికి వెళ్తుంది. అక్కడ కడుపు నిండా మేత మేస్తుంది. కానీ తిరిగి ఇంటికి రావాలంటే మళ్ళీ అదే నదిని ఈదుకుంటూ రావాలి. ఆ ఈతలో పడే కష్టం వల్ల మేసిన మేత అంతా అరిగిపోతుంది. అంటే, ఆ పశువుకు మేత వల్ల వచ్చిన శక్తి, నదిని ఈదడానికే ఖర్చయిపోతుంది. ఎవరైనా ఒక పనిలో ఎంత సంపాదిస్తున్నారో అదంతా ఆ పని చేయడానికే ఖర్చయిపోతే లాభంలేదని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News February 16, 2026
విరమణ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి?

రోజంతా ఉపవాసం ఉన్నందున, విరమణ సమయంలో ఒకేసారి భారీ ఆహారం తీసుకోకూడదు. ముందుగా మంచినీరు, పండ్ల రసంతో కడుపుని తేలికపరచాలి. ఆ తర్వాత సాత్విక ఆహారమైన అన్నం, పప్పులు వంటి సులభంగా అరిగే పదార్థాలను తీసుకోవాలి. కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా కాపాడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఈరోజు మాంసాహారం అస్సలు తినకూడదని పండితుల సూచన.
News February 16, 2026
శివరాత్రి జాగరణ.. ఇవాళ ఏం చేయాలంటే?

శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండి జాగరణ చేసిన భక్తులు ఇవాళ ఉదయం శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలని చెబుతున్నారు. నిన్న ఉపవాసం, జాగరణ చేసిన వారంతా ఇవాళ రాత్రి అయ్యే వరకూ నిద్రపోకూడదని, అలా చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుందని అంటున్నారు.


