News January 1, 2025
అమరావతిలో రూ.2,322 కోట్ల పనులకు టెండర్లు

AP: రాజధాని అమరావతి ప్రాంతంలో రూ.2,322 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ, ఏడీసీ టెండర్లు ఆహ్వానించాయి. టెండర్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 22వ తేదీగా నిర్ణయించాయి. ఈ నిధులతో రోడ్లు, మంచి నీటి సరఫరా, పవర్, ట్రంక్ ఇన్ఫ్రా, నీరుకొండ రిజర్వాయర్ వరద నివారణ పనులను చేపట్టాల్సి ఉంటుంది. సంక్రాంతిలోపు రూ.31వేల కోట్ల పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


