News March 21, 2024

కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్తత

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కేజ్రీవాల్ ఇంటి వద్ద 144 సెక్షన్ విధించి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు.

Similar News

News April 8, 2025

గెజిట్ జారీ.. అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం

image

వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయింది. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డుల కింద నమోదైన ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. మరోవైపు ఈ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 15, 16 తేదీల్లో అవి విచారణకు రానున్నాయి. కాంగ్రెస్, ఎంఐఎం, డీఎంకే తదితర పార్టీలు ఈ వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

News April 8, 2025

పూరన్ దెబ్బకు సెహ్వాగ్ రికార్డు బద్దలు

image

KKRతో మ్యాచులో LSG విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ (36 బంతుల్లోనే 87 ) ఊచకోత కోశారు. ఈ క్రమంలో పూరన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2,000 పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. 1,198 బంతుల్లోనే ఆయన 2 వేల పరుగులు మార్కును అందుకున్నారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ (1,211 బంతుల్లో) రికార్డును చెరిపేశారు. అగ్ర స్థానంలో రస్సెల్ (1,120 బంతుల్లో) ఉన్నారు.

News April 8, 2025

మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు

image

మంచు కుటుంబంలో మరోసారి వివాదం జరిగినట్లు తెలుస్తోంది. తన ఇల్లు ధ్వంసం చేశారని మంచు విష్ణుపై నార్సింగి పీఎస్‌లో మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్‌కు వెళ్లిన సమయంలో ఇంటిని ధ్వంసం చేశారని, కారుతో పాటు విలువైన వస్తువులను దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేశానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు.

error: Content is protected !!