News September 12, 2024

YCP MP మిథున్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో ఉద్రిక్తత

image

AP: రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు జిల్లా సదుం మండలం పెద్దూరులో జరిగిన ఎంపీ బర్త్ డే వేడుకల సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ గొడవలో పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News October 16, 2025

PHOTO GALLERY: శ్రీశైలంలో PM మోదీ

image

AP: ప్రధాని మోదీ శ్రీశైల మల్లన్న సేవలో తరించారు. సంప్రదాయ దుస్తులు ధరించి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. శ్రీశైల ఆలయంలో మోదీ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News October 16, 2025

రబీ పంటగా ఉలవల సాగు- అనువైన రకాలు

image

ఉలవలను సాధారణంగా లేట్ ఖరీఫ్/రబీకి ముందు, రబీలో పండించవచ్చు. వీటిని నీటి లభ్యతను బట్టి అక్టోబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. P.D.M-1, P.Z.M-1, P.H.G-62 రకాలు సాగుకు అనుకూలం. సాళ్ల పద్ధతిలో గొర్రుతో విత్తేటప్పుడు ఎకరాకు 8-10 కిలోలు, వెదజల్లి దున్నే పద్ధతిలో ఎకరానికి 12-15 కిలోల విత్తనం అవసరం. ప్రతి కిలో విత్తనాన్ని కార్బండిజమ్ 1గ్రా. లేదా థైరమ్‌ 3గ్రా.తో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.

News October 16, 2025

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి: APSDMA

image

AP: దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని APSDMA తెలిపింది. దేశంలోకి మే 24న, రాష్ట్రంలోకి మే 26న ఈ రుతుపవనాలు ప్రవేశించినట్లు వివరించింది. అటు ఇవాళ దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అవుతాయని ఐఎండీ పేర్కొంది. దీంతో ఇవాళ ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.