News March 21, 2025
తాడిపత్రిలో ఉద్రిక్తత

AP: అనంతపురం(D) తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. YCP నేత ఫయాజ్ బాషా ఇల్లు అక్రమ నిర్మాణమనే ఆరోపణతో మున్సిపల్ అధికారులు జేసీబీతో తరలివచ్చారు. దానివెంట టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వందలాది మంది అనుచరులతో వచ్చారు. ఈ క్రమంలో ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ శ్రేణులూ భారీగా వచ్చి ఎదురుదాడి చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Similar News
News March 22, 2025
వాహన ధరలను పెంచనున్న మహీంద్రా

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తమ కంపెనీ వాహన ధరలను 3శాతం పెంచనున్నట్లు తెలిపింది. ఇన్పుట్ ఖర్చులు కమోడిటీ ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ధరలు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే మారుతి సుజుకీ ఇండియా, హ్యుందాయ్, టాటా, కియా ఇండియా, సంస్థలు వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
News March 22, 2025
సినిమా నటులకు పాడు సంపాదన ఎందుకు? నారాయణ

సినిమా నటులకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వచ్చే పాడు సంపాదన ఎందుకని సీపీఐ జనరల్ సెక్రటరీ నారాయణ ప్రశ్నించారు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపును తప్పుడు పనులకు దుర్వినియోగం చేయోద్దని హితవు పలికారు. గతంలో చిరంజీవి కోకాకోలా యాడ్ ఇచ్చేవారని అయితే రక్తదానం చేస్తూ రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించానని తెలిపారు. ఆ తర్వాత అటువంటి చేయనని చిరంజీవి తనతో చెప్పారన్నారు.
News March 22, 2025
బల్లులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

ఇంటి గోడలపై నెమలి ఈకలను అంటించండి. వెల్లుల్లి రిబ్బల్ని గదులలో ఉంచితే వాటి వాసనకు బల్లులు దూరంగా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి అవి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పెట్టండి. నల్ల మిరియాలను నీటిలో కలిపి గోడలపై స్ప్రే చేయాలి. గుడ్డు పెంకుల్ని బల్లులున్న ప్రదేశాల్లో ఉంచండి. నాప్తలీన్ గోలీల వాసన బల్లులకు పడదు. వీటితో పాటు ఇంటిలో బూజు చెత్త లేకుండా క్లీన్గా ఉంచండి. తద్వార బల్లులు రాకుండా ఉంటాయి.