News December 11, 2024

టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

AP: పదో తరగతి పరీక్షల <>షెడ్యూల్‌ను <<>>మంత్రి లోకేశ్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 24న మ్యాథ్స్, 26న ఫిజిక్స్, 28న బయోలజీ, 31న సోషల్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చదివేందుకు వీలైనంత సమయం తీసుకునేలా షెడ్యూల్ ఇచ్చామని, మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.
☞☞ ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.

Similar News

News December 20, 2025

ముందస్తు అనుమతి ఉంటేనే న్యూఇయర్ వేడుకలు: పోలీసులు

image

TG: న్యూఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్పారు. ఈవెంట్‌కు ఎంత మంది వస్తున్నారు? ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో ముందే సమాచారమివ్వాలని ఇప్పటికే నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. అటు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని చెప్పారు.

News December 20, 2025

బడ్జెట్‌పై ఊహాజనిత అంచనాలు వద్దు: GOVT

image

TG: FY26-27 బడ్జెట్‌కు ఊహాజనిత అంచనాలు పంపొద్దని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ‘ఖర్చు హేతుబద్ధంగా ఉండాలి. ఎక్కువ/తక్కువలు లేకుండా వాస్తవ రిక్వైర్మెంట్ మాత్రమే పంపాలి. అవసరం మేరకే మెయింటెనెన్స్, రెంట్, వాహనాలకు ఖర్చు చేయాలి’ అని ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ విషయంలో రేట్ కాంట్రాక్ట్, కాలం, ఎంతమంది అవసరం, ఖర్చు అంశాలు HRM నిబంధనల ప్రకారమే ఉండాలని సూచించింది.

News December 20, 2025

₹3Cr కోసం తండ్రిని పాముకాటుతో చంపించి..

image

పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకనేది ఒకప్పటి మాట. మానవత్వం మరిచి ఆస్తుల కోసం తండ్రిని చంపేసే కొడుకులున్న కలికాలం ఇది. ఇలాంటి ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగింది. తండ్రి గణేశన్(56) పేరుపై ₹3Cr బీమా చేయించి పాము కాటుతో చంపారు దుర్మార్గపు కొడుకులు. OCTలో ఈ ఘటన జరగగా బీమా సంస్థ అనుమానంతో అసలు విషయం బయటికొచ్చింది. ప్రస్తుతం వీరు నోట్లకు బదులు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.